శీతాకాలంలో కరోనా: ఈ భౌతిక దూరం సరిపోదా?
శీతాకాలంలో మాత్రం ఆరు అడుగుల భౌతిక దూరం సరిపోకపోవచ్చని హెచ్చరిస్తున్నారు.
శ్వాసకోశ బిందువులతో తీవ్ర ప్రభావం: శాస్త్రవేత్తలు
లాస్ ఏంజలిస్: కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా ఇప్పటికే కనీసం ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలని నిపుణులు సూచిస్తున్న విషయం తెలిసిందే. అయితే, శీతాకాలంలో మాత్రం ఈ భౌతిక దూరం సరిపోకపోవచ్చని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చల్లటి వాతావరణంలో నోటి నుంచి వెలువడే తుంపరలు ఎక్కువ దూరం ప్రయాణించడం వల్ల వైరస్ వ్యాప్తి మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సూచిస్తున్నారు.
గత డిసెంబరులో మొదలైన వైరస్ విజృంభణ అనతికాలంలోనే ప్రపంచం మొత్తం వ్యాపించింది. అంతేకాకుండా వేసవి కాలంలోనూ దీని ఉద్ధృతి కొనసాగింది. ముఖ్యంగా వేడి వాతావరణం ఉన్నప్పటికీ మూసివున్న ప్రాంతాల్లో గాలిలో ఆ కణాలు ఎక్కువదూరం ప్రయాణిస్తూ వైరస్ వ్యాప్తికి కారణమైనట్లు ఇప్పటికే శాస్త్రవేత్తలు ఒక అంచనాకు వచ్చారు. అయితే, శీతాకాలంలో వైరస్ సోకిన వ్యక్తి శ్వాస నుంచి వెలువడే తుంపరలు నేరుగా ఎదుటివారిని చేరడం వల్ల ఇది మరింత ఎక్కువగా విజృంభించే అవకాశాలున్నట్లు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రస్తుతం పాటిస్తోన్న భౌతిక దూరం నిబంధన సరిపోదని స్పష్టంచేస్తున్నారు. దీనిపై జరిగిన తాజా పరిశోధన నివేదిక నానో లెటర్స్ జర్నల్లో ప్రచురితమైంది.
వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా, సీడీసీ నిర్దేశించిన ఆరు అడుగుల కన్నా ఎక్కువ దూరం శ్వాసకోశ బిందువులు ప్రయాణిస్తున్నట్లు మేము చాలా సందర్భాల్లో గుర్తించామని అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన యాన్యింగ్ ఝూ పేర్కొన్నారు. ‘అతి తక్కువ ఉష్ణోగ్రతలు, ఎక్కువ తేమ ఉండే కూలర్లు, రీఫ్రిజిరేటర్లు ఉపయోగించే ప్రదేశాల్లో వైరస్ ఆరు మీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించి, భూమిపై పడుతున్నట్లు గుర్తించాం. మిగతా వాతావరణంతో పోలిస్తే అలాంటి ప్రదేశాల్లో వైరస్ ఒకరోజుకంటే ఎక్కువ సేపు సజీవంగా ఉంటుంది. మాంసాహార శుద్ధి కేంద్రాలు సూపర్ స్ప్రెడర్ సెంటర్లుగా మారడానికి ఇదే కారణమనే తేల్చాము’ అని యాన్యింగ్ ఝూ స్పష్టంచేశారు. ఈ కారణాల వల్ల వేసవితో పోలిస్తే శీతాకాలంలో వైరస్ విజృంభణ ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని అన్నారు. అందుకే, చల్లని, తేమ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో భౌతిక దూరం అధికంగా పాటించడంతోపాటు మేలిరకమైన మాస్కులు, ఎయిర్ ఫిల్టర్లవంటివి ఉపయోగించాలని సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.