చెన్నై ఎయిర్‌పోర్టు మూసివేత..మెట్రో రైళ్లు బంద్‌!

నివర్‌ తుపాను ప్రభావంతో చెన్నై సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ రోజు రాత్రి 7గంటల నుంచి రేపు..........

Updated : 25 Nov 2020 19:09 IST

చెన్నై: నివర్‌ తుపాను ప్రభావంతో చెన్నై సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ రోజు రాత్రి 7గంటల నుంచి రేపు ఉదయం 7గంటల వరకు విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించారు. తుపాను తీవ్రత దృష్ట్యా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.

అలాగే, ఈ రోజు రాత్రి 7గంటల తర్వాత మెట్రో రైళ్ల సేవలను కూడా నిలిపివేస్తున్నట్టు చెన్నై మెట్రో అధికారులు తెలిపారు. గురువారం ఉండే వాతావరణాన్ని బట్టి మెట్రో రైలు సర్వీసులు రైళ్ల సర్వీసుల పునరుద్ధరణ ఉంటుందని పేర్కొన్నారు.

చెన్నైలో ప్రధాన రహదారుల మూసివేత
తుపాను ప్రభావంతో భారీ వర్షాల దృష్ట్యా చెన్నై నగరంలోని ప్రధాన రహదారులను అధికారులు మూసివేశారు. మళ్లీ ప్రకటించేవరకు రహదారుల మూసివేత కొనసాగుతుందని చెన్నై ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. 

పలు రైళ్లు రద్దు
మరోవైపు, ఈరోజు, రేపు నడవనున్న పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దుచేసింది. రేపటి చెన్నై సెంట్రల్‌ - తిరుపతి రైలుతో పాటు తిరుపతి - చెన్నై సెంట్రల్‌; హైదరాబాద్‌ -తంబరం; తంబరం- హైదరాబాద్‌; మదురై - బికనీర్‌; బికనీర్‌ మదురై; చెన్నై సెంట్రల్‌ - సంత్రగచ్చి రైళ్లను రద్దుచేసింది. అలాగే, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నడిచే ఎనిమిది రైళ్లను దారి మళ్లించడంతో పాటు మరో రైలు సర్వీసును రద్దుచేసినట్టు అధికారులు ప్రకటించారు.

ఇదీ చదవండి..

లైవ్‌: నివర్‌ గమనం ఇలా..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని