లద్దాఖ్‌ చేరుకున్న రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రెండ్రోజుల పర్యటన నిమిత్తం లద్దాఖ్‌ చేరుకున్నారు. సైనిక, స్థానిక అధికారులు లేహ్‌లో రక్షణ మంత్రికి స్వాగతం..

Updated : 17 Jul 2020 12:08 IST

లద్దాఖ్‌: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రెండ్రోజుల పర్యటన నిమిత్తం లద్దాఖ్‌ చేరుకున్నారు. సైనిక, స్థానిక అధికారులు లేహ్‌లో రక్షణ మంత్రికి స్వాగతం పలికారు. ఇవాళ, రేపు సరిహద్దు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం సైనిక అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం శ్రీనగర్‌ వెళ్లనున్న రాజ్‌నాథ్‌సింగ్‌ పాకిస్థాన్‌ సరిహద్దుల్లో పరిస్థితిని సమీక్షిస్తారు. అనంతరం తిరిగి దిల్లీ వెళ్లనున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని