మన సరిహద్దులు శత్రు దుర్భేద్యం: రాజ్‌నాథ్‌

భారత్‌ సరిహద్దులు శత్రు దుర్భేద్యం.. అంగుళం భూ భాగాన్ని కూడా ఎవరూ తాకలేరని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. ..

Updated : 17 Jul 2020 14:26 IST

లద్దాఖ్‌: భారత్‌ సరిహద్దులు శత్రు దుర్భేద్యం.. అంగుళం భూ భాగాన్ని కూడా ఎవరూ తాకలేరని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. గల్వాన్‌ ఘటన నేపథ్యంలో లద్దాఖ్‌లో పర్యటిస్తున్న రక్షణమంత్రి.. అమరులైన జవాన్లకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘గల్వాన్‌ ఘటనలో భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధ కలిగించింది. భారత్‌ ఎప్పుడూ శాంతినే కోరుకుంటోంది. ప్రపంచానికి భారత్‌ శాంతి సందేశాన్ని ఇచ్చింది. భారత్‌ ఎప్పుడూ ఏ దేశంపై దాడి చేయలేదు. పరిస్థితి విషమిస్తే దీటుగా జవాబిచ్చేందుకు భారత్‌ సిద్ధంగా ఉంది. భారత్‌లోని అంగుళం భూ భాగాన్ని కూడా ఎవరూ తాకలేరు. ఎవరైనా దురాక్రమణకు దిగితే దీటైన సమాధానం ఉంటుంది. దేశ గౌరవం అన్నింటికంటే చాలా గొప్పది. దేశ గౌరవంపై దాడిచేస్తే ఏ మాత్రం ఉపేక్షించం. భారత్‌ ఆత్మగౌరవాన్ని ఎవరూ దెబ్బతీయలేరు. సరిహద్దు వివాదం పరిష్కారంపై చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలు ఎంతమేరకు పరిష్కారం చూపిస్తాయో ఇప్పుడే చెప్పలేం’’ అని రాజ్‌నాథ్‌ సింగ్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని