సరిహద్దులో సైన్యం అప్రమత్తత భేష్: రాజ్నాథ్
సరిహద్దుల్లో భారత సైన్యం అప్రమత్తతను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. దిల్లీలో బుధవారం నిర్వహించిన ఉన్నత స్థాయి కమాండర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన విషయాల్ని రాజ్నాథ్ ట్విటర్ వేదికగా వెల్లడించారు.
దిల్లీ: సరిహద్దుల్లో భారత సైన్యం అప్రమత్తతను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. దిల్లీలో బుధవారం నిర్వహించిన ఉన్నత స్థాయి కమాండర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన విషయాల్ని రాజ్నాథ్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘దేశ భద్రతా దళాలను, ఆయుధాలను బలోపేతం చేసేందుకు భారత ప్రభుత్వం ఏ అవకాశాన్ని వదులుకోదు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత ఆర్మీ చేపడుతున్న భద్రతా కార్యక్రమాలపై నేను గర్విస్తున్నా. సైన్యాన్ని అన్నివిధాలుగా ప్రోత్సహించడానికి కేంద్ర రక్షణ శాఖ కట్టుబడి ఉంది. సైన్యం లక్ష్యాలకు అనుగుణంగా సంస్కరణలు, సహకారం అందించడానికి సిద్ధంగా ఉంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశ భద్రత, సార్వభౌమత్వానికి సంబంధించిన అనేక సవాళ్లను పరిష్కరించడంలో భారత సైన్యం విజయవంతమైంది. ఉగ్రవాదం, తిరుగుబాట్లు, ఏ ఇతర దాడుల సమస్యలనైనా తిప్పికొట్టడంలో సైన్యం కీలక పాత్ర పోషించింది’ అని రాజ్నాథ్ ట్వీట్లో తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!