‘మాజీ సైనికులపై దాడులు సహించేది లేదు’

ముంబయిలో నేవీకి చెందిన మాజీ అధికారిపై శివసేన కార్యకర్తలు దాడి చేయడంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందించారు. మాజీ సైనికులపై దాడులు చేయడాన్ని ఏ మాత్రం సహించేది లేదని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

Published : 13 Sep 2020 01:10 IST

దిల్లీ: ముంబయిలో నేవీకి చెందిన మాజీ అధికారిపై శివసేన కార్యకర్తలు దాడి చేయడంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందించారు. మాజీ సైనికులపై దాడులు చేయడాన్ని ఏ మాత్రం సహించేది లేదని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.‘శివసేన కార్యకర్తల చేతిలో దాడికి గురైన నేవీ మాజీ అధికారి మదన్‌ శర్మతో మాట్లాడాను. ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశాను. మాజీ సైనికాధికారులపై దాడులు చేయడాన్ని ఏ మాత్రం సహించేది లేదు. మదన్‌జీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

మరోవైపు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ సైతం స్పందిస్తూ.. ‘ప్రభుత్వం ఇలాంటి చర్యలను ప్రోత్సహించడం చాలా తప్పు. రాష్ట్రంలో రౌడీయిజం ఆపాలని ఉద్ధవ్‌జీని ట్విటర్‌ వేదికగా కోరా. దాడికి కారణమైన ఆరుగురు నిందితులను నిమిషాల వ్యవధిలోనే విడిచిపెట్టడం సరైంది కాదు.. వారిపై చర్యలు తీసుకోవాలి’అని వెల్లడించారు. 

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ఠాక్రేకు సంబంధించి ఎగతాళి చేసే చిత్రాలను వాట్సాప్‌లో పోస్ట్‌లో చేసినందుకు మదన్‌ శర్మ అనే మాజీ నేవీ అధికారిపై శివసేన కార్యకర్తలు శుక్రవారం దాడికి దిగిన విషయం తెలిసిందే. కండివలి ప్రాంతంలోని అతడి ఇంటికి వెళ్లి వెంబడించి మరీ చితకబాదటం అక్కడి సీసీ ఫుటేజీల్లో రికార్డయింది. వీడియో ఆధారంగా స్థానిక శివసేన నాయకుడు కమలేశ్‌ సహా ఐదుగురు నిందితులపై పోలీసులు శుక్రవారం రాత్రి కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు శనివారం మళ్లీ బెయిల్‌పై వదిలిపెట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని