డీజిల్‌పై వ్యాట్‌ను భారీగా తగ్గించిన దిల్లీ!

దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్న విషయం తెలిసిందే. గత కొన్నిరోజులుగా డీజిల్‌ ధరలో రికార్డుస్థాయి పెరుగుదల కనిపించింది.

Published : 31 Jul 2020 02:15 IST

30శాతం నుంచి 16.75శాతానికి తగ్గింపు
దీంతో ఒకేసారి రూ.8 తగ్గిన డీజిల్ ధర

దిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్న విషయం తెలిసిందే. గత కొన్నిరోజులుగా డీజిల్‌ ధరలో రికార్డుస్థాయి పెరుగుదల కనిపించింది. ఈ సమయంలో దిల్లీవాసులకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని అక్కడి ప్రభుత్వం తీసుకుంది. డీజిల్‌పై విధిస్తోన్న సుంకాన్ని భారీగా తగ్గించాలని దిల్లీ కేబినెట్‌ నిర్ణయించింది. ప్రస్తుతం డీజిల్‌పై ఉన్న 30శాతం వ్యాట్‌ను 16.75శాతానికి తగ్గించేందుకు కేబినెట్‌ నిర్ణయించినట్లు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. దీంతో డీజిల్‌ ధర దాదాపు రూ.8.36పైసలు తగ్గనుంది. ప్రస్తుతం దిల్లీలో లీటరు డీజిల్‌ ధర రూ.82ఉండగా తాజా నిర్ణయంతో అది రూ.73.64 పైసలకు తగ్గనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని