నోబెల్‌ శాంతి బహుమతికి ట్రంప్‌ నామినేట్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నోబెల్‌ శాంతి బహుమతికి నామినేట్‌ అయ్యారు. ఇజ్రాయిల్‌, యూఏఈ మధ్య ఒప్పందం కుదిర్చినందుకు గానూ నార్వే పార్లమెంట్‌ సభ్యుడు క్రిస్టియన్‌ ట్రైబిడ్రే జెడ్డే ఆయన పేరును...

Updated : 09 Sep 2020 16:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నోబెల్‌ శాంతి బహుమతి-2021కి నామినేట్‌ అయ్యారు. ఇజ్రాయిల్‌, యూఏఈ మధ్య ఒప్పందం కుదిర్చినందుకు నార్వే పార్లమెంట్‌ సభ్యుడు క్రిస్టియన్‌ ట్రైబిడ్రే జెడ్డే ఆయన పేరును నామినేట్‌ చేశారు. ఇరు దేశాల మధ్య సామరస్యం నెలకొనేలా కృషిచేశారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు సమస్యలను ట్రంప్‌ పరిష్కరించారంటూ ప్రశంసించారు. మధ్య ప్రాచ్యం నుంచి భారీ సంఖ్యలో అమెరికా దళాలను ట్రంప్‌ ఉపసంహరించుకొనేలా చేశారన్నారు. అయితే, ట్రంప్‌కు నోబెల్‌ శాంతి బహుమతిని ఇవ్వాలంటూ ఆయనకు మద్దతుగా ట్రైబిడ్రే జెడ్డే మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. 2018లోనూ ఆయన పేరును నామినేట్‌ చేశారు. అయితే, నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ ఈ విశిష్ట పురస్కారానికి ట్రంప్‌ పేరును నామినేట్‌ చేయడం గమనార్హం.

2009లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా నోబెల్‌ శాంతి బహుమతి పొందిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ దౌత్య సంబంధాల బలోపేతానికి, ప్రజల మధ్య సహకారానికి అసాధారణ కృషికి గాను ఆయనకు ఈ విశిష్ట పురస్కారం దక్కింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని