జర్మనీలో లాక్డౌన్ ఆంక్షలు!
గడిచిన కొన్ని వారాలుగా వైరస్ తీవ్రత పెరగడంతో జర్మనీ మరోసారి ఆంక్షలను కఠినతరం చేసేందుకు సిద్ధమైంది.
బెర్లిన్: కరోనా వైరస్ విజృంభణతో యూరప్ దేశాలు వణికిపోతున్నాయి. గడిచిన కొన్ని వారాలుగా వైరస్ తీవ్రత పెరగడంతో జర్మనీ మరోసారి ఆంక్షలను కఠినతరం చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే స్టోర్లు, పాఠశాలలు మూసివేతకు జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్ ఆదేశించారు. అంతేకాకుండా భౌతిక దూరం నిబంధనలను ప్రతిఒక్కరు పాటించాలని సూచించారు.
ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రానున్న నెలరోజుల పాటు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై అన్ని రాష్ట్రాల గవర్నర్లతో ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్ సమావేశమై చర్చించారు. అనంతరం డిసెంబర్ 16 నుంచి జనవరి 10 వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా క్రిస్మస్ సందర్భంగా ప్రజలు భారీ సంఖ్యలో గుమి కూడకుండా ఆంక్షలు విధించారు. పండగ వేళ ఇండోర్ ప్రదేశాల్లో కేవలం ఐదుగురిని మాత్రమే కలుసుకునేందుకు అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. వీటితో పాటు పండగ వేళ సంప్రదాయకంగా కాల్చే బాణసంచాపై కూడా నిషేధం విధించారు. ‘ఇప్పటికే వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రానున్న రోజుల్లో మరిన్ని చర్యలు తీసుకోవాల్సి వస్తోంది’ అని మెర్కల్ స్పష్టంచేశారు. ఇప్పటికే అమలులో ఉన్న ఆంక్షలు కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో విఫలమయ్యాయని..దీంతో మరిన్ని కఠిన ఆంక్షల దిశగా అడుగులు వేయాల్సి వస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇదిలాఉంటే, ఆదివారం ఒక్కరోజు జర్మనీలో 20వేల పాజిటివ్ కేసులు బయటపడగా 321మంది మృత్యువాతపడ్డారు. ఇక వారాంతంలో ఈ సంఖ్య భారీగా ఉంటున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు అక్కడ 13లక్షల మంది వైరస్ బయటపడగా 22వేల మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు.
ఇవీ చదవండి..
ఊపిరితిత్తులపై కరోనా ప్రభావం..డీకోడ్ చేసిన శాస్త్రవేత్తలు
భారత్లో కోలుకుంటున్న వారే అధికం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి డాక్టర్ లక్ష్మి