వీటో చేస్తా.. డొనాల్డ్ ట్రంప్
అమెరికా రక్షణ రంగ బిల్లును వీటో చేస్తానంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బెదిరించారు.
వాషింగ్టన్: అమెరికా రక్షణ రంగ బిల్లును తనకున్న విశేషాధికారాలతో వీటో చేస్తానంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు. 740 మిలియన్ డాలర్ల భారీ బిల్లు వల్ల అత్యధికంగా లాభపడేది చైనాయేనంటూ ఆయన మండిపడ్డారు. ఈ విషయమై ‘‘మన కొత్త రక్షణ బిల్లు వల్ల చైనాకు భారీ గెలుపు లభిస్తుంది. నేను దానిని వీటో చేస్తాను!’’ అని సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం తరఫున ఓడల కొనుగోలు, సైనికుల జీతభత్యాలు, భౌగోళిక విపత్తులను ఎదుర్కొనే విధానం తదితర కీలక విషయాలు నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ (ఎన్డీఏఏ) బిల్లు పరిధిలోకి వస్తాయి. కాగా, దీనిని అమెరికన్ కాంగ్రెస్లోని ఇరుసభలూ మూడింట రెండు వంతులకు పైగా మెజారిటీతో ఇప్పటికే ఆమోదించాయి.
2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎన్డీఏఏ బిల్లును అధ్యక్షుడు ట్రంప్ తొలి నుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దీనిలో గూగుల్, ట్విటర్, ఫేస్బుక్ తదితర సాంకేతిక సంస్థలకు అనుకూలంగా ఉన్న సెక్షన్ 230ని తొలగించకపోవటం పట్ల ఆయన విముఖంగా ఉన్నారు. సామాజిక మాధ్యమ సంస్థలు తమ ప్లాట్ఫాంలలో కనిపించే సమాచారాన్ని నియంత్రించగల అధికారం ఈ సెక్షన్ ద్వారా లభిస్తుంది. జార్జ్ ఫ్లాయిడ్ మృతితో జోరందుకున్న బ్లాక్ లైవ్స్ మ్యాటర్ నిరసనల ఉదంతం నుంచీ ట్రంప్ సోషల్ మీడియా సంస్థలపై గుర్రుగా ఉన్నారు. అవి పక్షపాత ధోరణిని అవలంబిస్తున్నాయని ఆయన పలుమార్లు ఆరోపించగా.. అది అబద్ధమంటూ ఆయా సంస్థలు ఖండిస్తూ వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రక్షణ రంగ బిల్లుపై నిర్ణయం తీసుకునేందుకు సెనేట్, ట్రంప్నకు పదిరోజుల వ్యవధి నిచ్చింది. కాగా, ఈ బిల్లు కాలవ్యవధి జనవరి 3వ తేదీతో ముగియనుంది. దీనితో సదరు బిల్లును వీటో చేయాలా లేదా చట్టంగా మారేందుకు అనుగుణంగా సంతకాలు చేయాలా నిర్ణయం ట్రంప్ పరిధిలోనే ఉంది.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.