జైషే ఉగ్ర‌ కుట్రను ప్రపంచం ముందుంచిన భారత్‌

పాకిస్తాన్‌ కేంద్రంగా దేశంలో అలజడులు సృష్టించేందుకు జరుగుతున్న కుట్రలను భారత్‌ ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లింది. ఉగ్రవాదులకు పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ అందిస్తున్న సహకారం గురించి యూఎస్‌ సహా పలు ఐరాస శాశ్వత సభ్య దేశాల రాయబారులకు భారత వి

Updated : 23 Nov 2020 22:31 IST

దిల్లీ: పాకిస్థాన్‌  కేంద్రంగా దేశంలో అలజడులు సృష్టించేందుకు జరుగుతున్న కుట్రలను భారత్‌ ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లింది. ఉగ్రవాదులకు పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ అందిస్తున్న సహకారం గురించి యూఎస్‌ సహా పలు ఐరాస శాశ్వత సభ్య దేశాల రాయబారులకు భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్దన్‌ శ్రింగ్లా వివరించారు. ఇటీవల కశ్మీర్‌లో చోటుచేసుకున్న నగ్రోటా ఘటనను ఉద్దేశిస్తూ.. ఎన్‌కౌంటర్‌కు కారణమైన వారికి పాక్‌తో గల సంబంధాలను రాయబారులకు తెలియజేశారు. సొరంగ మార్గాల ద్వారా వారెలా భారత్‌లోకి చొరబడుతున్నారో స్పష్టంగా వివరించారు. జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులకు పాక్‌ ఇంటెలిజెన్స్‌కు ఉన్న సంబంధాల గురించి ఆయన రాయబారులకు తెలియపరిచారు. కాగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పాక్‌ కేంద్రంగా.. సరిహద్దుల్లో 200 ఉగ్రవాద దాడులు జరగగా.. 199 మంది ఉగ్రవాదులు మరణించినట్లు శ్రింగ్లా వెల్లడించారు. 

పుల్వామా తరువాత, ఉగ్రవాదులు పెద్ద ఎత్తున దాడులకు పథకాలు రూపొందించినట్లు.. అందుకు సంబంధించిన ఆధారాలను సైతం శ్రింగ్లా రాయబారులకు అందించారు. జమ్మూకశ్మీర్లో ఉన్న శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీయడం.. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకోవడమే లక్ష్యంగా వారు చేస్తున్న కుట్రలను ఆయన వివరించారు. కాగా ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని నగ్రోటాలో నలుగురు జైషే ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. వారి నుంచి భారీగా ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని