
Updated : 16 Aug 2020 19:52 IST
త్రివర్ణ శోభితం..నయాగరా నుంచి బుర్జ్ ఖలీఫా!
విదేశాల్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
దిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవ కేవలం భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మిన్నంటాయి. 74వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలను పురస్కరించుకొని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్యాటక కేంద్రాలు కూడా త్రివర్ణ శోభితంలో ముస్తాబయ్యాయి. అటు నయాగరా జలపాతం నుంచి బుర్జ్ ఖలీఫా వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రదేశాలు భారత త్రివర్ణ పతాక రంగుల్లో మెరిసిపోయాయి. న్యూయార్క్లోని ఎంపైర్ స్టేట్ భవనం మూడు రంగుల్లో కళకళలాడింది. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఆయా దేశాలు సంఘీభావం ప్రకటించాయి. వేడుకల్లో భాగంగా వివిద దేశాల్లోని ప్రముఖ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన వేడుకల ఫోటోలు, వీడియోలను అక్కడి భారత రాయబార కార్యాలయ అధికారులు ట్విటర్లో షేర్ చేశారు.
Advertisement
Tags :