India In UN: శాంతి పరిరక్షకులకు సాంకేతిక రక్ష
ఆధునిక కాలంలో ఎదురవుతున్న కొత్త ముప్పుల నుంచి ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులను రక్షించుకోవాలంటే పటిష్ఠ సమాచార,
ఐరాస పటిష్ఠ భద్రత విధానాలను అందిపుచ్చుకోవాలి
భద్రత మండలి భేటీలో మంత్రి జైశంకర్
ఐరాస: ఆధునిక కాలంలో ఎదురవుతున్న కొత్త ముప్పుల నుంచి ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులను రక్షించుకోవాలంటే పటిష్ఠ సమాచార, అత్యాధునిక నిఘా వ్యవస్థల అవసరం ఉందని భారత్ అభిప్రాయపడింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని హింసాత్మక చర్యలకు వినియోగించుకుంటూ శాంతి స్థాపనకు విఘాతం కల్పిస్తున్న వారిని దీటుగా ఎదుర్కొనేలా ఐరాస శాంతి పరిరక్షణ వ్యవస్థ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించింది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ బుధవారం ఐరాస ప్రధాన కార్యాలయంలో జరిగిన భద్రత మండలి సమావేశంలో ‘శాంతి స్థాపన కోసం సాంకేతికత: రక్షకులకు రక్షణ’ అనే అంశంపై ప్రసంగించారు. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ సమక్షంలో నిర్వహించిన ఈ భేటీకి జైశంకర్ అధ్యక్షత వహించారు. 1948 నుంచి మొదలుకొని ఇప్పటివరకూ విభిన్న సవాళ్లను ఎదుర్కొంటూ ఐరాస శాంతి పరిరక్షణ కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయని జైశంకర్ పేర్కొన్నారు. భారత్ తరఫున ఐరాసకు ఇప్పటివరకూ 49 మిషన్ల కోసం 2.5 లక్షల ట్రూపులను పంపినట్లు పేర్కొన్నారు. ఐరాస శాంతి పరిరక్షకులకు భద్రత కల్పించడానికి మరింత సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా నాలుగు అంశాలతో కూడిన భద్రత వ్యవస్థను ఆయన ప్రతిపాదించారు. ‘‘సమాచార సేకరణ, వినియోగం, విశ్లేషణ, పంపిణీకి అత్యంత విశ్వసనీయమైన విధానాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా శాంతి పరిరక్షణ ప్రక్రియకు ఆరంభం నుంచే ప్రయోజనం కలుగుతుంది. ఘర్షణ ప్రాంతాల కచ్చితమైన గుర్తింపు, అక్కడి పరిస్థితుల ప్రత్యక్ష విశ్లేషణ నిఘా వ్యవస్థకు అత్యంత కీలకం. దీనివల్ల శాంతి పరిరక్షణ సిబ్బంది భద్రతకు పటిష్ఠ చర్యలు తీసుకోవచ్చు’’ అని జైశంకర్ చెప్పారు.
‘యునైట్ అవేర్’కు భారత్ రూపకల్పన
శాంతి పరిరక్షణ కార్యకలాపాలు జరిగే ప్రాంతాలను ప్రత్యక్షంగా చూస్తూ, అక్కడి పరిస్థితులను విశ్లేషిస్తూ సమన్వయం చేసుకోవడానికి వీలుకల్పించేలా ఓ కొత్త సాంకేతికతకు భారత్ రూపకల్పన చేసింది. ‘యునైట్ అవేర్’ పేరుతో రూపొందించిన ఈ పరిజ్ఞానానికి ఐరాస సహకారం అందించింది. దీనికోసం భారత్ 16.4 లక్షల డాలర్లను వెచ్చించింది. అంతకు ముందు భారత్, ఐరాసల మధ్య సాంకేతిక పరిజ్ఞాన భాగస్వామ్యం గురించి ఒప్పందం కుదిరింది.
రెండు పత్రాలకు ఏకగ్రీవ ఆమోదం
భారత్ అధ్యక్షతన ఐరాస భద్రత మండలి శాంతి పరిరక్షణకు సంబంధించి రెండు కీలక పత్రాలను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఐరాస శాంతి పరిరక్షకులపై జరిగే నేరాలకు బాధ్యులను గుర్తించేందుకుగానూ ‘అకౌంటబిలిటీ ఆఫ్ క్రైమ్స్ ఎగైన్స్ట్ యూఎన్ పీస్కీపర్స్’ అనే పత్రానికి భారత్ రూపకల్పన చేసింది. దీనికి భద్రత మండలిలోని అన్ని సభ్య దేశాలతో పాటు 80కి పైగా ఐరాస సభ్య దేశాలు సహకారం అందించాయి. శాంతి భద్రతల సమస్య పరిష్కారానికి అంతర్జాతీయ సమాజం మద్దతునివ్వాలని ఇందులో ప్రతిపాదించారు. శాంతి పరిరక్షణకు సాంకేతికత అవసరమంటూ భద్రత మండలి అధ్యక్షుడిగా జైశంకర్ చేసిన ప్రకటనతో కూడిన ‘టెక్నాలజీ ఫర్ పీస్కీపింగ్’ పత్రానికీ భద్రత మండలి ఆమోదం తెలిపింది. భద్రత మండలికి సంబంధించి ఈ తరహా పత్రాన్ని ఆమోదించడం ఇదే తొలిసారి. శాంతి పరిరక్షణలో అసువులు బాసిన ఐరాస కార్యకర్తల స్మృతి చిహ్నం వద్ద జైశంకర్ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు.
భారత పౌరులను తరలించడంపైనే దృష్టి: జైశంకర్
న్యూయార్క్: అఫ్గాన్లో జరుగుతున్న పరిణామాలను భారత్ అత్యంత జాగ్రత్తగా గమనిస్తునట్లు జైశంకర్ పేర్కొన్నారు. అక్కడ చిక్కుకుపోయిన భారత పౌరులను సురక్షితంగా తరలించడంపైనే ప్రధానంగా దృష్టిపెట్టినట్లు చెప్పారు. భద్రత మండలి సమావేశం తర్వాత ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. అంతకు ముందు అఫ్గాన్లో ఉద్రిక్త పరిస్థితులపై ఆంటోనియో గుటెరస్తో జైశంకర్ చర్చించారు. ఐరాస ప్రధాన కార్యాలయంలో గుటెరస్తో మంగళవారం భేటీ అయ్యారు. ఉత్తర ఐరోపా దేశం ఈస్టోనియా విదేశాంగ మంత్రి ఇవా-మారియాతోనూ జైశంకర్ సమావేశమై అఫ్గాన్ పరిణామాలను చర్చించారు.
చర్చల్లో కీలక భూమిక బరాదర్దే!
కాబుల్: అఫ్గాన్ ప్రభుత్వ అధికారులతో జరిపే చర్చల్లో తాలిబన్ల అగ్రశ్రేణి రాజకీయ నాయకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్దే కీలక పాత్ర కావచ్చని భావిస్తున్నారు. దశాబ్దాల తరబడి పోరాడడంలోనే కాకుండా డొనాల్డ్ ట్రంప్ సర్కారుతో ఒప్పందం కుదుర్చుకోవడంలోనూ ఈ నేతది ముఖ్య భూమిక. గతంలో అధికారంలోకి వచ్చిన రోజులతో పోలిస్తే తామెంతో మారామనీ, ‘సమ్మిళిత, ఇస్లామిక్ ప్రభుత్వం’ ఏర్పాటును తాము కోరుకుంటున్నామని తాలిబన్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముల్లాపైనే అందరి దృష్టి పడింది. తాలిబన్ కమాండర్ ముల్లా మహమ్మద్ ఒమర్ సజీవంగా ఉన్నప్పుడు డిప్యూటీలుగా వ్యక్తిగతంగా నియమించుకున్నవారిలో ప్రస్తుతం జీవించి ఉన్నది బరాదర్ మాత్రమే. ఇప్పటి సర్వోన్నత నేత మౌలావీ హిబాతుల్లా అఖ్తుంజాదా కంటే ఎక్కువగా బయటకు కనిపించేది ముల్లా బరాదరే. మంగళవారం కాందహార్కు చేరుకున్న ఈ నేతకు పెద్దఎత్తున స్వాగతం లభించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
First phase of LS polls: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. -
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే బలమైన, స్థిర ప్రభుత్వం అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
తనకు జైల్లో ఇన్సులిన్ అందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. -
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు.
తాజా వార్తలు (Latest News)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్