కొజికోడ్‌ ప్రమాదం: డీజీసీఏ కీలక నిర్ణయం

కేరళలోని కోజికోడ్‌ విమానాశ్రయంలో ఇటీవల చోటుచేసుకున్న విమాన ప్రమాద ఘటనతో పౌర విమానయానశాఖ మరింత అప్రమత్తమైంది.......

Published : 12 Aug 2020 02:11 IST

దిల్లీ: కేరళలోని కోజికోడ్‌ విమానాశ్రయంలో ఇటీవల చోటుచేసుకున్న విమాన ప్రమాద ఘటనతో పౌర విమానయానశాఖ మరింత అప్రమత్తమైంది. ఈ మేరకు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వర్షా కాలం మొత్తం కొజికోడ్‌  విమానాశ్రయాన్ని మూసివేయాలని నిర్ణయించినట్టు డీజీసీఏ వెల్లడించింది. ఈ నెల 7న దుబాయి నుంచి కొజికోడ్‌ విమానాశ్రయానికి వచ్చిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం రన్‌వే పైనుంచి జారిపడి లోయలోకి దూసుకెళ్లడంతో జరిగిన ఘోర ప్రమాదం పెను విషాదం నింపింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా.. 140మందికి పైగా క్షతగాత్రులైన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని