బైడెన్తోనైనా కలిసి పని చేస్తా: ఓబ్రియాన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్కు వృత్తిపరమైన సలహాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారు రోబర్ట్ ఓబ్రియాన్ వెల్లడించారు. ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపులో అవినీతి జరిగిందంటూ ఓవైపు ట్రంప్ కోర్టుమెట్లెక్కిన నేపథ్యంలో..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్కు సలహాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రియాన్ వెల్లడించారు. ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపులో అవినీతి జరిగిందంటూ ఓవైపు ట్రంప్ కోర్టు మెట్లెక్కిన నేపథ్యంలో ఓబ్రియాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఓ కీలక బాధ్యతల్లో ఉన్న ఓబ్రియాన్ ట్రంప్కు వ్యతిరేకంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
గ్లోబల్ సెక్యూరిటీ ఫోరంలో ఓబ్రియాన్ మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్ మరో నాలుగేళ్లు ఆ పదవిలో కొనసాగాలని ఆశిస్తున్నట్లు చెబుతూనే... ఒక వేళ నూతనంగా ఎన్నికైన జో బైడెన్, కమలా హారిస్ నేతృత్వంలోని ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినా, వారితో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. ‘‘ కొత్త ప్రభుత్వం ఏర్పాటైనా కాస్త కుదురుకొని వారి విధానాలను అమలు చేసేందుకు సమయం పడుతుంది. ప్రభుత్వమేదైనా ఇప్పటిలాగే బాధ్యతలను నిర్వర్తిస్తాను. అందులో ఎటువంటి సందేహం లేదు’’ అని ఓబ్రియాన్ స్పష్టం చేశారు. బైడెన్ కొత్తగా ఫ్రొఫెషనల్ నేషనల్ సెక్యూరిటీ టీంను సిద్ధం చేసుకునే అవకాశముందని ఓబ్రియాన్ తెలిపారు.
మరోవైపు అమెరికాలోని మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లకుగానూ ఇప్పటి వరకు డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ 290 , రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ 232 ఓట్లను కైవసం చేసుకున్నారు. 16 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న జార్జియాలో కౌంటింగ్ తేలలేదు. ఇప్పటికే 99 శాతం కౌంటింగ్ పూర్తి కాగా..బైడెన్ 15,000 పైచిలుకు ఓట్ల మెజార్టీలో కొనసాగుతున్నారు. బైడెన్ అధ్యక్షపదవికి అవసరమైన 270 ఓట్లు సాధించడంతో ఒకవేళ జార్జియాలో ట్రంప్ విజయం సాధించినా పెద్దగా మార్పులేమీ ఉండబోవు.
అమెరికా రాజ్యాంగం ప్రకారం ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థికి ఏమైనా అనుమానాలుంటే డిసెంబరు 8లోగా రుజువు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత డిసెంబర్ 14న విజేతను అధికారికంగా ప్రకటిస్తారు. అయితే, అమెరికాలో ఒక రకంగా ఎన్నికల సమరం ముగిసిపోయినట్లేనని ఓబ్రియాన్ అన్నారు. గతంలోనూ శాంతియుత వాతావరణంలో అధికార మార్పిడి జరిగినట్లు ఆయన గుర్తు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
-
బస్సులో సీఎం... ఎండలో జనం
-
విజయవాడ రైల్వేస్టేషన్లో రూ.20కే నాణ్యమైన భోజనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?