‘అరబ్ ప్రపంచం గొప్ప నాయకుడ్ని కోల్పోయింది’
కువైట్ రాజు షేక్ సభా అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సభా మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. షేక్ సభాతో భారత్కు మంచి అనుబంధం ఉందని ఈ సందర్భంగా మోదీ గుర్తుచేసుకున్నారు.
కువైట్ రాజు మృతి పట్ల మోదీ సంతాపం
దిల్లీ: కువైట్ రాజు షేక్ సబా అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబా మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. షేక్ సబాతో భారత్కు మంచి అనుబంధం ఉందని ఈ సందర్భంగా ప్రధాని గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు మోదీ ట్వీట్ చేశారు. ‘ఈ రోజు కువైట్తో పాటు అరబ్ ప్రపంచం గొప్ప నాయకుడిని కోల్పోయింది. షేక్ సబా గొప్ప రాజనీతిజ్ఞుడు. భారత్కు మంచి మిత్రుడు. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడంలో ఆయన ఎంతో కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా కువైట్లోని భారతీయుల సంరక్షణ కోసం ఆయన ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. కువైట్ రాజు మృతి చెందడం ఎంతో బాధాకరం. ఆయన కుటుంబానికి, కువైట్ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ అని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు. కువైట్ రాజు షేక్ సబా (91) అమెరికాలోని రోచెస్టర్లో మంగళవారం మృతి చెందిన విషయం తెలిసిందే. రాజు మరణంతో కువైట్లో సంతాప దినం ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?