పంజాబ్లో 15 రోజుల రాత్రి కర్ఫ్యూ
కరోనా వైరస్ విజృంభణకు కళ్లెం వేయడమే లక్ష్యంగా పంజాబ్ ప్రభుత్వం కీలక చర్యలు ప్రకటించింది. రాష్ట్రంలో 15 రోజుల పాటు రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని సీఎం అమరీందర్సింగ్ అధికారులను ఆదేశించారు........
చండీగఢ్: కరోనా వైరస్ విజృంభణకు కళ్లెం వేయడమే లక్ష్యంగా పంజాబ్ ప్రభుత్వం కీలక చర్యలు ప్రకటించింది. రాష్ట్రంలో 15 రోజుల పాటు రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని సీఎం అమరీందర్సింగ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో రాత్రి 10గంటల నుంచి ఉదయం 5గంల వరకు కర్ఫ్యూ అమలు చేయాలని సూచించారు. ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే రెట్టింపు జరిమానాను (రూ.1000) విధించాలని ఆదేశించారు. డిసెంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయనున్నారు. కర్ఫ్యూ అమలులో ఉన్న రోజుల్లో నగరాలు/ పట్టణాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, వివాహ వేదికలు రాత్రి 9.30గంటలకే మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లు ధరించకపోతే రెట్టింపు జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
మరోవైపు, పంజాబ్లో మంగళవారం ఒక్కరోజే 22 మంది కొవిడ్తో మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 4653కి పెరిగింది. అలాగే, పాజిటివ్ కేసుల సంఖ్య 1,47,665గా ఉంది. పంజాబ్ గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు మరో ఆరుగురు నిన్న కొవిడ్ బారిన పడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,36,178 మంది వైరస్ నుంచి కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 6834 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.