కరోనాలోనూ రైలు కూత ఆగలేదు..
కరోనా మహమ్మారి వెంటాడినప్పటికీ ఈ ఏడాది రైల్వేలో 98 శాతం సరకు రవాణా జరిగిందని తెలిపారు. గతేడాదితో పోలిస్తే కేవలం 2 శాతం మాత్రమే తక్కువ జరిగిందని వెల్లడించారు. ఈ మేరకు 2020 ఏడాదికి సంబంధించిన......
రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ వెల్లడి
దిల్లీ: కరోనా మహమ్మారి వెంటాడినప్పటికీ ఈ ఏడాది రైల్వేలో 98 శాతం సరకు రవాణా జరిగిందని రైల్వేబోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే కేవలం 2 శాతం మాత్రమే తక్కువ జరిగిందని వెల్లడించారు. ఈ మేరకు 2020 ఏడాదికి సంబంధించిన ప్రగతి నివేదికతో పాటు భవిష్యత్ ప్రణాళికలను మీడియాకు వెల్లడించారు. 2020లో తొలిసారి కిసాన్ ప్రత్యేక రైళ్లు నడపడం ఈ ఏడాది రైల్వేశాఖ ప్రత్యేకత అని వీకే యాదవ్ వెల్లడించారు. మొదటి కిసాన్ రైలు మహారాష్ట్ర నుంచి దేవ్లాలి నుంచి బిహార్లోని దనాపూర్కు నడిపామని, డిమాండ్ దృష్ట్యా దాన్ని ముజఫర్పూర్ వరకు పొడిగించామని తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9 రూట్లలో కిసాన్ రైళ్లు నడుపుతున్నామని వివరించారు. ఇప్పటి వరకు 27వేల టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల రవాణా జరిగిందని తెలిపారు. ఈ రైళ్ల వల్ల రైతుల పంటలకు మంచి మార్కెట్ వచ్చిందని చెప్పారు.
ప్రమాదాల నివారణకు అన్ని రైళ్లలో బోగీలను ఎల్హెచ్బీ కోచ్లుగా మార్చడమే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయని వీకే యాదవ్ వివరించారు. ఈ కోచ్ల నిర్మాణంలో ఆత్మనిర్భర్ భారత్కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. 120 కిలోమీటర్లు.. 160 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో నడిచే ప్యాసింజర్ లోకోమోటివ్ ఇంజిన్లు మేకిన్ ఇండియాలో భాగంగా తయారవుతున్నాయని చెప్పారు. 2022 డిసెంబర్ నాటికి తొలి లోకోమోటివ్ ప్రారంభమవుతుందని తెలిపారు.
ఛార్ధామ్ యాత్రికులకు గుడ్న్యూస్
ఛార్ధామ్ యాత్రికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. నాలుగు క్షేత్రాలను కలుపుతూ నిర్మించే ఈ రైల్వే లైను నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) సిద్ధమైందని తెలిపింది. అలాగే, 2024 డిసెంబర్ నాటికి 125 కిలోమీటర్ల పొడవైన రిషికేశ్ - కర్ణప్రయాగ్ రైలు లింక్ పూర్తవుతుందని వెల్లడించారు. మరోవైపు రామేశ్వరం ఆధునిక పంబన్ వంతెన 2021 అక్టోబర్ నాటికి పూర్తవుతుందని చెప్పారు.
ఒకేసారి ‘బుల్లెట్’
బుల్లెట్ రైలు ప్రాజెక్ట్కు సంబంధించి ఇప్పటి వరకు 1396 హెక్టర్లలో 949 హెక్టార్ల భూమిని రైల్వే శాఖ సేకరించామని రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. గుజరాత్లో 90 శాతం వరకు భూసేకరణ పూర్తయ్యిందని తెలిపారు. మహారాష్ట్రలోని థానేలో భూసేకరణ విషయంలో సమస్యలు ఉన్నాయని చెప్పారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని తెలిపారు. అక్కడ దశలవారీగా భూ సేకరణ జరుగుతుందన్నారు. బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ మొత్తం ఒకేసారి ప్రారంభించడానికి రైల్వే శాఖ అన్ని ప్రయత్నాలూ చేస్తోందని వివరించారు. మొదటి దశ బుల్లెట్ రైలును 325 కిలోమీటర్ల నిడివిలో నడుపుతామని వివరించారు.
అదో గొప్ప విజయం
కరోనా సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు ఆహార ధాన్యాలు, బొగ్గు, ఎరువులు, ఔషధాలు సహా అవసరమైన అన్ని వస్తువులను చేరవేయడం రైల్వే శాఖ సాధించిన అతిపెద్ద ఘనత అని వీకే యాదవ్ అన్నారు. లాక్డౌన్ సమయంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు కార్మిక ప్రత్యేక రైళ్లను నడపడం కూడా ఒక పెద్ద విజయమేనని చెప్పారు. భద్రతను పెంచుతూ డిమాండ్ ప్రకారం ప్రయాణికుల, సరకు రవాణా రైళ్లను నడపడమే లక్ష్యమని కొత్త సంవత్సరం ప్రాధాన్యాలను రైల్వే బోర్డు ఛైర్మన్ వివరించారు.
ఇవీ చదవండి..
నాకు ప్రజాస్వామ్య పాఠాలు నేర్పుతున్నారు: మోదీ
పూజాదేవి.. తొలి మహిళా బస్సు డ్రైవర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.