కరోనా చుట్టే సంవాదం!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా చెప్పుకునే అధ్యక్ష అభ్యర్థుల సంవాదం తుది ముఖాముఖి చర్చ ప్రారంభమైంది. ఎన్నికలకు కేవలం రెండు వారాల కంటే తక్కువ సమయం ఉన్న తరుణంలో ఈ చర్చ జరుగుతుండడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ల వైఖరులపై అందరూ దృష్టి సారించారు........
ట్రంప్, బైడెన్ మధ్య వాడీవేడి చర్చ
అమెరికా ఆర్థిక వ్యవస్థను తిరిగి పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. చైనా నుంచి వచ్చిన మహమ్మారి విజృంభణకు ముందు రోజుల్లోకి తిరిగి విజయవంతంగా తీసుకెళ్లాలి. దానికి నేను కట్టుబడి ఉన్నాను. -ట్రంప్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి
నాకు ఓటేశారా.. లేదా..అన్న దానితో నిమిత్తం లేకుండా నేను అమెరికా ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహిస్తాను. దేశంలో మెరుగుపరచాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అవన్నీ మనకు అవకాశాలే. కాల్పనికతపై శాస్త్రీయతకు, భయంపై ఆశలకు అవకాశం కల్పించాలి. ఆ దిశగా మనం ముందుకు సాగాలి. -బైడెన్, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా చెప్పుకునే అధ్యక్ష అభ్యర్థుల సంవాదం తుది ముఖాముఖి చర్చ ప్రారంభమైంది. ఎన్నికలకు కేవలం రెండు వారాల కంటే తక్కువ సమయం ఉన్న తరుణంలో ఈ చర్చ జరుగుతుండడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ల వైఖరులపై అందరూ దృష్టి సారించారు. ట్రంప్ కరోనా నుంచి కోలుకున్న తర్వాత జరుగుతున్న చర్చ కావడంతో మహమ్మారి కట్టడిపై ఆయన వైఖరిలో ఎలాంటి మార్పు ఉండనుందనే దానిపై సర్వత్రా ఆసక్తి ఉండింది.
కరోనా విజృంభణ..
ట్రంప్: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా విజృంభణతోనే అభ్యర్థుల చర్చ ప్రారంభమైంది. తమ ప్రభుత్వం తీసుకున్న చర్చల వల్ల అంచనాల కంటే తక్కువ మంది చనిపోయారు. త్వరలో మహమ్మారి అంతం కాబోతోంది. నేను కరోనా నుంచి కోలుకున్నట్లుగానే అందరూ బయటపడతారు. అందరికీ రోగనిరోధక శక్తి ఏర్పడుతుంది. మహమ్మారి వ్యాప్తికి నేనో లేక బైడెనో కారణం కాదు. చైనాయే అసలు కారణం. కొన్ని వారాల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. దీనిపై సమన్వయకర్త వివరణ కోరడంతో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారు. వ్యాక్సిన్పై తాను చేసిన వ్యాఖ్య హామీ కాదని.. కేవలం అంచనా మాత్రమే అని వివరించారు. వచ్చే వేసవి లేదా శీతాకాలం చివరి వరకు వ్యా్క్సిన్ అందరికీ అందుబాటులో ఉండకపోచ్చునని సీడీసీ డైరెక్టర్ అంచనా వేశారన్నారు.
బైడెన్: వ్యాక్సిన్ పంపిణీకి ట్రంప్ వద్ద ఎలాంటి ప్రణాళిక లేదు. రాబోయే శీతాకాలంలో మరిన్ని చీకటి రోజులు ఎదుర్కోబోతున్నాం. లక్షల మంది మరణాలు కారణమైన వ్యక్తికి మాట్లాడే అర్హతే లేదు. చైనా నుంచి రాకపోకల్ని నిలువరించడంలో ట్రంప్ సరైన సమయంలో నిర్ణయం తీసుకోలేదు. కరోనా ప్రమాదకారి అని ట్రంప్ ఇప్పటి వరకూ చెప్పకపోవడం విచారకరం.
హెల్త్కేర్..
ట్రంప్: నా హయాంలో ఒబామా కేర్ కంటే మెరుగైన ఆరోగ్య విధానాన్ని తీసుకొచ్చాను. ఇంకా మెరుగైన విధానాన్ని రూపొందిస్తాం. మేం కచ్చితంగా గెలుస్తాం. మా విధానాలు, ప్రాధాన్యతలు ఏంటో మీరే చూస్తారు.
బైడెన్: ఇప్పటికే అనేక వ్యాధులతో బాధపడుతున్న వారిని కూడా సంరక్షణ కల్పిస్తానన్న ట్రంప్ హామీకి సవాల్ విసురుతున్నా. చాలా రోజుల నుంచి ట్రంప్ ఆరోగ్య విధానం గురించి మాట్లాడుతున్నారు. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన విధానాన్ని రూపొందించలేదు.
అవినీతి ఆరోపణలు..
బైడెన్: నేను ఇప్పటి వరకు నా జీవితంలో విదేశాల నుంచి ఒక్క డాలర్ కూడా తీసుకోలేదు. ట్రంప్ చైనాలో కూడా రహస్యంగా ఓ బ్యాంకు ఖాతాను నిర్వహిస్తున్నారు.
ట్రంప్: బైడెన్ ఇప్పటి వరకు రష్యా నుంచి 3.5 మిలియన్ల డాలర్లు తీసుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మరోసారి బైడెన్ తనయుడు హంటర్ బైడెన్ వ్యాపారాలను ప్రస్తావించారు. విదేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాల్లో అనేక అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు.
వలస విధానం...
చట్టవిరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశించిన తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని వేరుచేసే విధానంపై ట్రంప్ దాటవేత ధోరణిని అవలంబించారు. అలాంటి వారి కోసం ఒబామా హయాంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలపైకి చర్చను మళ్లించారు. వాటిని పంజరాలుగా అభివర్ణించారు.
బైడెన్ మాట్లాడుతూ.. ‘‘తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని వేరు చేసి ట్రంప్ పెద్ద నేరానికి పాల్పడ్డారు. వారు ఇప్పుడు ఏకాకులుగా మారారు. ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోయడం లేదు’’
జాత్యహంకారం..
ట్రంప్: నల్లజాతీయుల కోసం అధ్యక్షుడు లింకన్ తర్వాత నేను చేసినంతగా ఎవరూ చేయలేదు. ఇక్కడ ఉన్న వారిలో జాత్యహంకారం లేని వారిలో నేను ముందుంటాను.
బైడెన్: అమెరికా చరిత్రంలో అత్యంత జాత్యహంకారం ఉన్న అధ్యక్షుడు ట్రంప్. దేశంలో వివక్ష వ్యవస్థీకృతమైంది. దీన్ని రూపుమాపేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది.
♦ అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిన ఏ ఒక్క దేశాన్నీ వదిలిపెట్టేది లేదని జో బైడెన్ హెచ్చరించారు. కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు.
ఒకరి ప్రసంగానికి మరొకరు అడ్డుపడకుండా తాజా చర్చలో మైక్ను కట్ చేసేలా మ్యూట్ బటన్ను ఏర్పాటు చేశారు. దీంతో అభ్యర్థుల మధ్య ఎలాంటి రసాభాస చోటుచేసుకోకపోవడం గమనార్హం. పైగా ఒక్కో అంశంపై స్పందించడానికి ఒక్కొక్కరికీ ఏకధాటిగా రెండు నిమిషాల సమయం కేటాయించారు.
అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడే అభ్యర్థులు బహిరంగంగా ముఖాముఖి చర్చించడం ఆనవాయితీగా వస్తోంది. ఎన్నికల ముందు మూడుసార్లు జరిగే ఈ చర్చలను ‘కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్’(సీపీడీ) నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ట్రంప్, బైడెన్ల మధ్య తొలి సంవాదం సెప్టెంబరు 29న జరిగింది. ఆ తర్వాత రెండు రోజులకే ట్రంప్ కరోనా బారినపడ్డారు. అనంతరం ఆయన కోలుకున్నప్పటికీ.. రెండో చర్చను వర్చువల్గా నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి ట్రంప్ విముఖత వ్యక్తం చేయడంతో దానిని రద్దు చేశారు. మూడో సంవాదం నేడు జరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే బలమైన, స్థిర ప్రభుత్వం అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
తనకు జైల్లో ఇన్సులిన్ అందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. -
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు