కొవిడ్ మూలాలు: గబ్బిలాల కోసం అన్వేషణ!
కరోనా వైరస్ మూలాలను కనిపెట్టేందుకు అక్కడి గబ్బిలాల కోసం అవి నివసించే స్థావరాలపై థాయిలాండ్ శాస్త్రవేత్తలు గాలింపు చేపట్టారు.
రంగంలోకి దిగిన థాయిలాండ్ శాస్త్రవేత్తలు
థాయిలాండ్: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ఎక్కడినుంచి వచ్చిందనే విషయంపై ఇప్పటికీ సందిగ్థత నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిన నిపుణులు బృందం ఇప్పటికే చైనాలో ప్రాథమిక దర్యాప్తు పూర్తిచేసింది. తాజాగా దీనిపై థాయిలాండ్లోనూ పరిశోధనలు చేపట్టారు. కరోనా వైరస్ మూలాలను కనిపెట్టేందుకు అక్కడి గబ్బిలాల కోసం అవి నివసించే స్థావరాలపై గాలింపు చేపట్టారు. చైనా బయట తొలిసారిగా థాయిలాండ్లోనే కరోనా వైరస్ బయటపడడంతో ఈ గబ్బిలాలపై జరుపుతున్న పరిశోధనలపై ఆసక్తి నెలకొంది.
ప్రపంచవ్యాప్తంగా 2కోట్ల మందిలో బయటపడ్డ కరోనా వైరస్ మహమ్మారి ఇప్పటికే 7లక్షల 50వేల మందిని బలితీసుకుంది. ఇంతటి మహమ్మారి ముఖ్యంగా గబ్బిలాల నుంచే వ్యక్తులకు సోకిందనే అభిప్రాయం ఆదిలోనే వ్యక్తమైంది. దక్షిణ చైనాలోని యున్నాన్లో గబ్బిలాల్లో బయటపడిన వైరస్కు కరోనా వైరస్ పోలికలు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. తాజాగా థాయిలాండ్ కూడా గబ్బిలాల్లో పరిశోధన మొదలుపెట్టింది. ఇప్పటికే వీరిదగ్గర దాదాపు 19జాతులకు చెందిన గబ్బిలాలు ఉన్నప్పటికీ, వీటిపై ఇప్పటివరకు కరోనా పరిశోధన పరీక్షలు చేయలేదని సమాచారం. ప్రస్తుతం వైరస్ మూలాలను కనుగొనే ప్రయత్నాలు ముమ్మరం చేసిన థాయిలాండ్ శాస్త్రవేత్తలు మరో 200లకు పైగా గబ్బిలాలను పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వీటికోసం సాయ్ యాక్ జాతీయ పార్కులో ఉన్న గుహల్లో అన్వేషణ మొదలుపెట్టారు. అక్కడ వీటిని పట్టుకునేందుకు థాయిలాండ్ రెడ్క్రాస్కు చెందిన ఆరోగ్య కేంద్రం నిపుణులు ప్రత్యేక గూళ్లను ఏర్పాటు చేశారు.
గబ్బిలాలు, వాటినుంచి సంక్రమించే వ్యాధులపై గత 20సంవత్సరాలుగా పరిశోధనలు జరుపుతున్న సుపాపార్న్ ఈ పరిశోధనలకు నేతృత్వం వహిస్తున్నారు. ఆ గుహల్లో ఉండే వివిధ జాతుల గబ్బిలాల నుంచి రక్తం, లాలాజలంతోపాటు అవి విడుదల చేసే వ్యర్థాలను కూడా సేకరిస్తున్నామని తెలిపారు. తద్వారా వీటిలో ఉండే వ్యాధికారక వైరస్ల గురించి మరింత పరిశోధనలను చేసేందుకు వీలుంటుందని సుపాపార్న్ స్పష్టం చేశారు. అంతేకాకుండా కొవిడ్-19కు కారణమైన వైరస్కూడా ఈ గబ్బిలాల్లో ఉండే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్లు ఆమె అభిప్రాయపడుతున్నారు. ‘ఈ మహమ్మారికి సరిహద్దులు లేవు. ఈ వైరస్ గబ్బిలాల నుంచి సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. ఏ ప్రదేశానికైనా ఇవి వెళ్లగలవు’ అని పరిశోధకురాలు సుపాపార్న్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి