ట్రంప్నకు కరోనా.. ప్రచారం సంగతేంటి?
ట్రంప్కు కరోనా సోకటంతో రిపబ్లికన్ పార్టీ ఎన్నికల ప్రచార నిర్వహణ డోలాయమానంలో పడింది.
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికలకు నెలరోజుల వ్యవధి మాత్రమే ఉండగా డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ బారిన పడ్డారు. తొలుత అధికార నివాసం వైట్హౌస్లోనే ఉంటారన్న ట్రంప్.. వైద్యనిపుణుల సూచనల మేరకు ప్రస్తుతం వాషింగ్టన్లోని వాల్డర్ రీడ్ మిలిటరీ ఆస్పత్రిలో చేరారు. ఇప్పటికే అధ్యక్ష అభ్యర్థుల తొలి చర్చలో పాల్గొన్న ట్రంప్.. ఎన్నికలలోగా మరో రెండు చర్చాగోష్ఠి కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. మరోవైపు రిపబ్లికన్ పార్టీ ఎన్నికల ప్రచార నిర్వహణ సందిగ్ధంలో పడింది. ఈ పరిస్థితిలో ప్రచార కార్యక్రమాలను వాయిదా వేయటం లేదా వర్చువల్గా నిర్వహించటం అనే రెండు అవకాశాలు మాత్రమే ఉన్నాయని ఆయన ప్రచార నిర్వాహకుడు బిల్ స్టెపియన్ వెల్లడించారు.
‘‘అధ్యక్షుడు ట్రంప్ పాల్గొనాల్సిన అన్ని ప్రచార కార్యక్రమాలను వర్చువల్ రూపంలోకి మార్చే ఏర్పాటు కొనసాగుతోంది. ఆ విధంగా చేయటం సాధ్యం కాకపోతే వాయిదా వేస్తాం. అంతేకాకుండా అధ్యక్షుడి కుటుంబ సభ్యులు భాగం కావాల్సిన కార్యక్రమాలు కూడా తాత్కాలికంగా వాయిదా పడ్డాయి’’ అని స్టెపియన్ వివరించారు. కాగా, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రచార కార్యక్రమాలను కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నారు.
కాగా కీలకమైన ఈ దశలో ట్రంప్ అందుబాటులో లేకపోతే ఆయన విజయావకాశాలపై నీలినీడలు కమ్ముకున్నట్లే అనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. మరో వైపు ఎన్నికలు జరిగే నవంబర్ 3లోగా ట్రంప్ కరోనా నుంచి కోలుకుంటే ఆయన ఈ కొవిడ్ విపత్కర పరిస్థితిలో ఆశావాదానికి చిహ్నంగా నిలవచ్చని.. నయం కానట్లయితే సానుభూతితో గెలిచే అవకాశం కూడా లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్