7.8 తీవ్రతతో భూకంపం: సునామీ హెచ్చరికలు

అలస్కా పీఠభూమిలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో అధికారులు భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల వరకు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. సముద్ర తీరానికి సమీపంలో, దీవుల్లో, దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ....

Updated : 23 Jul 2020 12:14 IST

వాషింగ్టన్‌: అలస్కా పీఠభూమిలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో అధికారులు భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల వరకు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. సముద్ర తీరానికి సమీపంలో, దీవుల్లో, దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సైరన్‌ మోగిస్తూ హెచ్చరించారని తెలిసింది.

బుధవారం 06:12 గంటలకు ప్రకంపనలు వచ్చాయి. ఆంకోరేజ్‌కు నైరుతి దిశగా 800 కిలోమీటర్ల దూరం, పెర్రివిలెకు ఆగ్నేయం దిశగా 96 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని అమెరికా జియోలాజికల్‌ సర్వే తెలిపింది. తీవ్రత, ఇతర ప్రమాణాలను బట్టి భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల వరకు ప్రమాదకరంగా సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని పసిఫిక్‌ సునామీ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.

భూకంపం తర్వాత చాలాసేపటి వరకు సాధారణ అలలు మాత్రమే రికార్డవ్వడంతో అలస్కాలోని కొన్ని ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలను వెనక్కి తీసుకున్నారు. అయితే  కొడియాక్‌ దీవుల్లో దిగువ ప్రాంతాల్లో ఉన్న వేలాది మందిని ఖాళీ చేయించారు. ఇప్పటి వరకు ప్రమాదకర అలలేవీ రాలేదని ఈసారి వస్తాయని కచ్చితంగా చెప్పలేమని ఓ అధికారి అన్నారు. అన్నిటికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని