నైజీరియాలో ఇద్దరు భారతీయుల కిడ్నాప్‌!

ఆఫ్రికా దేశమైన నైజీరియాలో పనిచేస్తున్న ఇద్దరు భారతీయులను అక్కడి సాయుధ ముఠాలు కిడ్నాప్‌ చేశాయి. దీంతో దేశంలోని విదేశీ పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు..........

Published : 14 Dec 2020 09:30 IST

నైజీరియా: ఆఫ్రికా దేశమైన నైజీరియాలో పనిచేస్తున్న ఇద్దరు భారతీయులను అక్కడి సాయుధ ముఠాలు కిడ్నాప్‌ చేశాయి. దీంతో దేశంలోని విదేశీ పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఓ ఔషధ సంస్థలో పనిచేస్తున్న ఇద్దరు భారతీయులు తమ పని ముగించుకొని బయటకు వస్తుండగా.. సాయుధులైన దుండగులు వారిని అపహరించుకొని వెళ్లిపోయారు. వారిని గుర్తించేందుకు పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నైజీరియాలో ఉంటున్న విదేశీయులంతా అప్రమత్తంగా ఉండాలని.. ఏవైనా అనుమానికత కదలికలు ఉంటే వెంటనే భద్రతా సిబ్బంది దృష్టికి తీసుకురావాలని కోరారు. నైజీరియాలో ఔషధ పరిశ్రమల్లో వందలాది మంది భారతీయులు పనిచేస్తుంటారు. విదేశీయులను కిడ్నాప్‌ చేసి భారీగా డబ్బు డిమాండ్‌ చేయడం ఈ మధ్యకాలంలో పరిపాటిగా మారింది. డబ్బు అందగానే వారికి ఎలాంటి హాని జరగకుండా వదిలిపెడుతుంటారు.

ఇవీ చదవండి..
కరోనాతో ఎస్వాతీనీ దేశ ప్రధాని మృతి

ఎంత అమానుషం..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని