వ్యాక్సిన్ ట్రయల్స్: ఆ వాలంటీర్లు కావలెను..!
భారత్, ఆసియా, ఆఫ్రికా, కరేబియన్ ప్రాంతాలకు చెందిన అల్పసంఖ్యాక జాతుల వారు వ్యాక్సిన్ ప్రయోగాల్లో పాల్గొనాలని బ్రిటన్ ప్రభుత్వం పిలుపునిచ్చింది.
బ్రిటన్ వ్యాక్సిన్ టాస్క్ఫోర్స్ పిలుపు
లండన్: కరోనావైరస్ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ముమ్మర కృషి జరుగుతోంది. ఇందులోభాగంగా ఇప్పటికే చాలా వ్యాక్సిన్లు తుది దశ ప్రయోగాలకు చేరుకున్నాయి. ఈ సమయంలో భారత్, ఆసియా, ఆఫ్రికా, కరేబియన్ ప్రాంతాలకు చెందిన అల్పసంఖ్యాక జాతుల వారు వ్యాక్సిన్ ప్రయోగాల్లో పాల్గొనాలని బ్రిటన్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. ‘ప్రాంతం, వర్గం బేధం లేకుండా ఎవ్వరిపైనైనా కరోనావైరస్ ప్రభావం చూపుతుంది. అన్నివర్గాల, వయస్సులవారిపై సమర్థవంతంగా పనిచేసే వ్యాక్సిన్ కోసం ప్రయత్నిస్తున్నాం. అందుకే, ఈ క్లినికల్ ట్రయల్స్లో మనమందరం భాగస్వామ్యం కావాలి’ అని యూకే బిజినెస్ సెక్రటరీ అలోక్ శర్మ పిలుపునిచ్చారు. తద్వారా వ్యాక్సిన్ ప్రయోగాలను మరింత వేగవంతం చేయవచ్చని సూచించారు.
‘వైరస్బారిన పడుతున్న వారితోపాటు మరణిస్తున్న వారిలో నల్లజాతీయులు, ఆసియా, అల్పసంఖ్యాక జాతుల వారు ఎక్కువగానే ఉన్నారు. అందుకే భిన్న వర్గాలవారు వ్యాక్సిన్ ప్రయోగాల్లో పాల్గొనడం ఎంతో ముఖ్యం. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత విభిన్న వర్గాలు, జాతుల వారిపైనా వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని ఆధారాలతో చూపించడానికి ఈ తరహా ప్రయోగాలు ఎంతో కీలకం’ అని ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ముఖ్యపరిశోధకురాలు డాక్టర్ మహేషి రామసామి పేర్కొన్నారు.
బ్రిటన్లో కరోనావైరస్ తీవ్రత ఎక్కువగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు అక్కడ 6లక్షల 20వేల మంది వైరస్ బారినపడ్డారు. వీరిలో ఇప్పటికే దాదాపు 43వేల మంది ప్రాణాలు కోల్పోయారు. యూకేలో వైరస్ బయటపడిన వారిలో శ్వేతజాతీయుల కంటే ఎక్కువ స్థాయిలో వివిధ దేశాలకు చెందిన అల్పసంఖ్యాక జాతుల వారు ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ సమయంలోనే వ్యాక్సిన్ ప్రయోగాల్లో పాల్గొనేవారి పేర్లను నమోదుచేసుకునే ప్రక్రియను బ్రిటన్ జులైలో చేపట్టింది. ఇప్పటివరకు 2,70,000మంది అక్కడి నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్హెచ్ఎస్)లో పేర్లను నమోదుచేసుకున్నారు.
సమర్థవంతమైన, సురక్షితమైన వ్యాక్సిన్ను సాధ్యమైనంత తొందరగా తీసుకొచ్చేందుకు వ్యాక్సిన్ టాస్క్ఫోర్స్ను యూకే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఆక్స్ఫర్డ్/ఆస్ట్రాజెనికా టీకాతోపాటు నొవావాక్స్వంటి ఆరు వ్యాక్సిన్లు ఇందులో ఉన్నాయి. ప్రయోగాల్లో భాగంగా దీర్ఘకాలిక వ్యాధులున్న వారితోపాటు 65ఏళ్ల వయస్సు పైబడిన వారుకూడా పాల్గొనాలని ఈ టాస్క్ఫోర్స్ విజ్ఞప్తిచేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పట్నాలోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. -
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్లైన్లో వైరల్గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. -
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?