హాథ్రస్ ఆసరాగా సంఘవిద్రోహ కార్యకలాపాలు?
హాథ్రస్ హత్యాచార ఘటన, తదనంతరం జరుగుతున్న పరిణామాలపై అనేక విషయాలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఇప్పటికే పలువురిపై దేశద్రోహ, అల్లర్లకు కుట్ర కేసులు నమోదు చేసిన పోలీసులు.. మంగళవారం సాయంత్రం నలుగురు వ్యక్తుల్ని అరెస్టు చేశారు..........
పీఎఫ్ఐతో సంబంధం ఉన్న నలుగురి అరెస్ట్
లఖ్నవూ: హాథ్రస్ హత్యాచార ఘటన, తదనంతరం జరుగుతున్న పరిణామాలపై అనేక విషయాలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఇప్పటికే పలువురిపై దేశద్రోహ, అల్లర్లకు కుట్ర కేసులు నమోదు చేసిన పోలీసులు.. మంగళవారం సాయంత్రం నలుగురు వ్యక్తుల్ని అరెస్టు చేశారు. వారంతా ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’(పీఎఫ్ఐ) అనే ర్యాడికల్ గ్రూప్నకు చెందినవారిగా పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు ఈ సంస్థే నిధులు సమకూర్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై నిషేధం విధించాలని అప్పట్లో యూపీ పోలీసులు భారత ప్రభుత్వాన్ని కోరారు.
హాథ్రస్కు వెళుతున్న మార్గంలో అనుమానంగా తిరుగుతున్న నలుగురిని మథురలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వారి నుంచి శాంతికి విఘాతం కలిగించే అవకాశం ఉన్న కొన్ని వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం జరిపిన విచారణలో వారికి పీఎఫ్ఐతో పాటు దాని అనుబంధ సంస్థ క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు లభించాయన్నారు.
హాథ్రస్ ఘటనను ఆసరాగా చేసుకొని కొన్ని అరాచక శక్తులు దేశంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు దేశంలో కుల ఘర్షణలు రెచ్చగొట్టేందుకు కొన్ని సంఘ విద్రోహ శక్తులు పన్నాగం పన్నాయని యూపీ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై పలు ప్రాంతాల్లో ఎఫ్ఐఆర్లు నమోదుచేశాయి. ఈ కుట్రలో విదేశీ శక్తుల పాత్ర కూడా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా ఇటీవల భారత్లో కార్యకలాపాలు నిలిసివేసిన అంతర్జాతీయ సంస్థ ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’పై అనుమానాలు లేవనెత్తినట్లు సమాచారం. సంస్థ సేకరించిన నిధులు పక్కదారి పట్టి అల్లర్లను రెచ్చగొట్టేందుకు వినియోగిస్తున్నట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగే అవకాశం ఉందని సమాచారం. మనీలాండరింగ్ ఆరోపణల కింద ఆమ్నెస్టీపై విచారణ జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం