ఆ యుద్ధాలకు అమెరికా స్వస్తి - ట్రంప్
అమెరికాలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతులేని ‘విదేశీ యుద్ధాలకు’ ఇక అమెరికా దూరంగా ఉంటుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు.
వాషింగ్టన్: అమెరికాలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతులేని ‘విదేశీ యుద్ధాలకు’ ఇక అమెరికా దూరంగా ఉంటుందని డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. విదేశీ యుద్ధాలను హాస్యాస్పదంగా అభివర్ణించిన ఆయన, ‘ఎప్పటికీ ముగియని’ అలాంటి యుద్ధాలకు అమెరికా దూరంగా ఉంటుందని వెల్లడించారు. అయితే, అమెరికన్లను బెదిరింపులకు పాల్పడే ఉగ్రవాదుల్ని మాత్రం అణచివేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఫ్లోరిడాలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం శాంతి ద్వారానే అమెరికా పునర్నిర్మాణానికి కృషి చేస్తామన్నారు.
విదేశీ సరిహద్దులను రక్షించడం, విదేశాల్లో యుద్ధాలు, ఇతర దేశాలవృద్ధికోసం గతకొన్ని దశాబ్దాలుగా అమెరికా పెడుతున్న ఖర్చుపై ట్రంప్ విరుచుకుపడ్డారు. వీటికోసం అమెరికా రాజకీయ నాయకులు లక్షల కోట్లు ఖర్చు పెట్టారని విమర్శించారు. ఇక ఇలాంటి విదేశీ యుద్ధాలకు స్వస్తి చెప్పి, అమెరికా పునర్నిర్మాణానికి మాత్రమే కృషి చేస్తామని స్పష్టంచేశారు. దీనిలో భాగంగా ఇప్పటికే విదేశాల్లో ఉన్న తమ బలగాలను అమెరికాకు తిరిగి రప్పించడంతోపాటు అమెరికాలో పరిశ్రమలు, ఉద్యోగ కల్పన కోసం చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇలాంటి సమయంలో ఉగ్రవాదులు ఎవరైనా అమెరికాపై బెదిరింపులకు పాల్పడితే మాత్రం వారిని కచ్చితంగా అణచివేస్తామని స్పష్టంచేశారు. ‘ముగింపులేని యుద్ధాలను’ ప్రస్తావించిన ఆయన..అమెరికా దళాలు తిరిగి వారి ఇంటికి చేరుకుంటున్నట్లు ప్రకటించారు. ఎవ్వరికీ లేని ‘సైనిక శక్తి’ అమెరికా సొంతమన్న ట్రంప్, ఈ సైనిక శక్తిని మాత్రం కొనసాగిస్తామని స్పష్టంచేశారు. తమ సైన్యాన్ని బలోపేతం చేస్తూనే, శాంతికి కృషి చేస్తామని పునరుద్ఘాటించారు.
ప్రచారసభకు భారీ జనం..
తాజాగా ఫ్లోరిడాలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భారీ సంఖ్యలో ట్రంప్ మద్దతుదారులు పాల్గొన్నారు. తన సొంత ప్రాంతమైన జాక్సన్విల్లే ప్రచారసభకు భారీ సంఖ్యలో మద్దతుదారులు తరలిరావడంతో ట్రంప్ సంతోషం వ్యక్తంచేశారు. బైడెన్ సభకు కేవలం పదుల సంఖ్యలో మాత్రమే వస్తారని..కానీ ఇక్కడ మాత్రం 30వేలకుపైగా హాజరుకావడం గొప్ప విషయమని ట్రంప్ వెల్లడించారు. డెమొక్రటిక్ అభ్యర్థి అధికారంలోకి వస్తే, అమెరికాలో పన్నులు భారీగా పెంచుతారని అన్నారు. ఇక ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న కమలా హారిస్ కూడా వెనుకంజలోనే ఉన్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, దాదాపు 30వేల మందికిపైగా పాల్గొన్న ఈ ప్రచారసభలో భౌతికదూరం వంటి జాగ్రత్తలు పాటించకపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
తిహాడ్ జైల్లో అరవింద్ కేజ్రీవాల్పై కుట్ర జరుగుతోందని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ శనివారం ఆరోపించారు. -
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
Isha Arora: యూపీలో విధులు నిర్వహించిన పోలింగ్ ఏజెంట్ ఈశా అరోడా ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్గా మరారు. ఇంతకీ ఎవరామె..? -
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
Doordarshan: ‘డీడీ న్యూస్’ లోగోను కాషాయ రంగులోకి మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ‘ప్రసార భారతి’ కాదని ‘ప్రచార భారతి’గా మారిందని పలువురు మండిపడుతున్నారు. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?