వుహాన్ శాస్త్రవేత్తలను ప్రశ్నించిన WHO బృందం!
ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్ మూలాలపై ఇప్పటికీ సందిగ్ధం నెలకొన్న విషయం తెలిసిందే. అసలు వుహాన్ ల్యాబ్లోనే దీన్ని తయారు చేశారనే వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో వైరస్ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తు ప్రారంభించింది.
వుహాన్ శాస్త్రవేత్తలతో విస్తృత చర్చ
WHO ముందస్తు నిపుణుల బృందం దర్యాప్తు పూర్తి
జెనీవా: ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్ మూలాలపై ఇప్పటికీ సందిగ్ధం నెలకొన్న విషయం తెలిసిందే. అసలు వుహాన్ ల్యాబ్లోనే దీన్ని తయారు చేశారనే వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో వైరస్ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తు ప్రారంభించింది. ఫలితాల కోసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ముందస్తు బృందం చేపట్టిన దర్యాప్తు తాజాగా పూర్తైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
దర్యాప్తులో భాగంగా వైరస్కు కేంద్రబిందువుగా భావిస్తోన్న వుహన్ ల్యాబ్ శాస్త్రవేత్తలతో ఈ బృందం విస్తృతంగా చర్చించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఎపిడెమియోలాజికల్ నివేదికలు, బయెలాజికల్, జెనెటిక్ విశ్లేషణలు, అక్కడి మార్కెట్లలోని జంతు ఆరోగ్య పరిశోధనల గురించి చైనా శాస్త్రవేత్తలతో చర్చించినట్లు డబ్ల్యూహెచ్ఓ అధికార ప్రతినిధి క్రిష్టయన్ లిండ్మియర్ విలేకరులకు వెల్లడించారు. అంతేకాకుండా పూర్తి సమాచారాన్ని ఈ బృందం సేకరించిందని తెలిపారు. అయితే, ఈ దర్యాప్తు తుది ఫలితాలు మాత్రం డబ్ల్యూహెచ్ఓ వెల్లడించలేదు.
ప్రాథమిక దర్యాప్తు పూర్తికావడంతో అంతర్జాతీయ నిపుణులతో పూర్తి స్థాయి దర్యాప్తు, పరిశోధన చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. అసలు జంతువుల నుంచి కొవిడ్19 మహమ్మారి మానువుల్లోకి ఎలా ప్రవేశించింది? తదితర అంశాలపై పరిశోధన ఈ పూర్తి స్థాయి నిపుణుల బృందం దర్యాప్తు చేయనుంది. ఈ దర్యాప్తు బృందంలో ఏయే నిపుణులు ఉండాలనే విషయంపై ఇప్పటికే ముసాయిదాను రూపొందించారు. అయితే, ఈ దర్యాప్తు ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయం తెలియరాలేదు.
ప్రపంచవ్యాప్తంగా వైరస్ విజృంభిస్తోన్న తరుణంలో ఈ వైరస్కు అసలు కారణం చైనానే అని పలుదేశాలు విమర్శించాయి. దీనిపై అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశాయి. అమెరికా ఏకంగా ప్రపంచ ఆరోగ్యసంస్థపైనే విమర్శలు గుప్పించింది. చివరకు ఒత్తిడి పెరగడంతో దర్యాప్తు జరిపేందుకు డబ్ల్యూహెచ్ఓ అంగీకరించింది. వైరస్ మూలాలను శోధించేందుకు మూడు వారాల క్రితం ఇద్దరు డబ్ల్యూహెచ్ఓ నిపుణుల ముందస్తు దర్యాప్తు బృందం చైనాకు వెళ్లింది.
ఇవీ చదవండి..
వుహాన్ లేబొరేటరీలో ఏం జరిగింది?
చైనాకు బయలుదేరిన WHO నిపుణుల బృందం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం