కరోనాను కట్టడి చేయలేం..
తాము కొవిడ్-19 మహమ్మారిని నియంత్రించలేమని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ఉన్నతాధికారి పరోక్షంగా అంగీకరించడం సంచలనం సృష్టిస్తోంది.
అంగీకరించిన అమెరికా అత్యున్నతాధికారి
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కొవిడ్-19 విజృంభిస్తోంది. ఇక్కడి కేసుల సంఖ్య విషయంలో రోజురోజుకూ కొత్త రికార్డులు నమోదౌతున్నాయి. ఈ దేశంలో ప్రతిరోజు సుమారు వెయ్యి కరోనా వైరస్ మరణాలు సంభవిస్తుండగా .. మొత్తం మరణాలు రెండు లక్షల మార్కును ఎప్పుడో దాటేశాయి. ఈ నేపథ్యంలో తాము కొవిడ్-19 మహమ్మారిని నియంత్రించలేమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ఉన్నతాధికారి పరోక్షంగా అంగీకరించడం సంచలనం సృష్టిస్తోంది. అధ్యక్ష ఎన్నికలు మరో వారం రోజుల్లో ఉన్న నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించటం ప్రాముఖ్యం సంతరించుకుంది.
ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మిడోస్ కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలకు సంబంధించి పలు ప్రశ్నలకు సమాధానాన్ని దాటవేశారు. ప్రభుత్వ యంత్రాంగం ఈ మహమ్మారిని ఎందుకు నియంత్రించడం లేదన్న ప్రశ్నకు జవాబుగా.. అది వైరస్ ద్వారా వ్యాప్తించే ఫ్లూ మాదిరి అంటువ్యాధి కావటం వల్లనే అని ఆయన అంగీకరించారు. కొవిడ్ను నియంత్రించేందుకు తాము ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని ఆ వెంటనే సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
దేశ చరిత్రలోనే పెద్ద వైఫల్యం
ఈ వ్యాఖ్యలపై డెమొక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ స్పందించారు. మహమ్మారి కరోనా వైరస్ను సాధారణ ఫ్లూతో పోల్చడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం తమ అశక్తతను అంగీకరించిందని.. ఇది అమెరికా చరిత్రలోనే పెద్ద వైఫల్యమని ఆమె అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని తాము తొలినుంచీ వెల్లడిస్తూ వచ్చామన్నారు. ప్రపంచ జనాభాలో కేవలం నాలుగు శాతాన్ని కలిగిఉన్న అమెరికాలో.. ఇరవై శాతం కరోనా మరణాలు సంభవిస్తున్నాయన్నారు. ఇదిలా ఉండగా, తన సమీప సిబ్బందికి కరోనా సోకినప్పటికీ రిపబ్టికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి మైక్ పెన్స్ ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొనటం కూడా విమర్శలకు తావిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం