Amit shah: సామాన్యుడికి ఊరట.. మోదీకి థాంక్స్: అమిత్ షా ట్వీట్
పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తంచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న.......
దిల్లీ: పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తంచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో సున్నితమైందన్నారు. ఈ నిర్ణయం సామాన్యుడికి ఊరటనివ్వడమే కాకుండా ద్రవ్యోల్బణాన్ని కూడా తగ్గిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పలు భాజపా పాలిత రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు మరింత తగ్గించేలా ప్రజలకు ఉపశమనం కలిగించే నిర్ణయాలు తీసుకోవడం ప్రశంసనీయమన్నారు.
దీపావళి కానుకగా ప్రధాని నరేంద్ర మోదీ సామాన్య ప్రజలకు పెద్ద ఉపశమనం కలిగించారని అమిత్ షా పేర్కొన్నారు. లీటరు పెట్రోల్పై ₹5, డీజిల్పై ₹10ల చొప్పున ఎక్సైజ్ సుంకం తగ్గించారని తెలిపారు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పటికీ సామాన్యుడికి ఊరటనిచ్చేలా తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో సున్నితత్వంతో కూడినదనీ.. ఇందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు, దేశంలో బిహార్తో పాటు పలు భాజపా పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యాట్ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో మండిపోతున్న ధరలతో అల్లాడుతున్న ప్రజలకు కొంతవరకు ఊరట లభించినట్టైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.