Anand Mahindra: మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా.. తుక్కు బండికి బదులు బొలెరో వాహనం
వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. సృజనాత్మకత, కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సహించడంలో తాను ముందుంటానని మరోసారి నిరూపించుకున్నారు......
ఇంటర్నెట్ డెస్క్: వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. సృజనాత్మకత, కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సహించడంలో తాను ముందుంటానని మరోసారి నిరూపించుకున్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఓ వ్యక్తి తయారు చేసిన తుక్కు వాహనాన్ని తీసుకొని.. అందుకు బదులుగా అతనికి ఎస్యూవీ బొలెరో వాహనాన్ని కానుకగా ఇచ్చారు.
మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లా దేవ్రాష్ట్రే గ్రామానికి చెందిన దత్తాత్రేయ లోహర్ అనే వ్యక్తి స్థానికంగా కంసాలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయన కుమారుడికి కారు ఎక్కాలని చిన్నప్పటి నుంచి కోరిక. అయితే అంత స్తోమత లేని దత్తాత్రేయ.. తుక్కు వాహనాల విడి భాగాలు సేకరించి సొంతంగా వాహనం తయారుచేశారు. కిక్ ఇస్తే స్టార్ట్ అయ్యేలా దీన్ని రూపొందించారు. సాధారణంగా ఈ మెకానిజంను బైక్లలో చూస్తుంటాం. అంతేకాదు.. దత్తాత్రేయ తయారుచేసిన వాహనంలో స్టీరింగ్ ఎడమవైపున ఉండటం విశేషం.
కాగా ఈ వాహనం గురించి ఓ యూట్యూబ్ ఛానెల్ వీడియో రూపొందించగా.. అది ఆనంద్ మహీంద్రా దృష్టిలో పడింది. ఈ వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన ఈ వ్యాపార దిగ్గజం.. వారికి అప్పుడే ఈ ఆఫర్ ప్రకటించారు. ‘ఇది ఆటోమొబైల్ నిబంధనలను అందుకోవడం లేదని తెలుసు. కానీ, మన ప్రజల తెలివితేటలు, తక్కువ వనరులతో ఎక్కువ పనిచేసే సామర్థ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా. నిబంధనలకు అనుగుణంగా లేని కారణంగా స్థానిక అధికారులు ఈ వాహనాన్ని రోడ్డుపైకి రాకుండా అడ్డుకుంటారు. దాన్ని నాకు ఇస్తే అందుకు బదులుగా బొలెరో వాహనాన్ని ఇస్తాను. ఆయన సృజనాత్మకతను మా మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో ప్రదర్శనకు ఉంచుతాం. అది మాలో స్ఫూర్తి నింపుతుంది’ అని ట్విటర్లో పేర్కొన్నారు.
మహీంద్రా ఆఫర్కు అంగీకరించిన దత్తాత్రేయ తన వాహనాన్ని ఇస్తానని తర్వాత ప్రకటించారు. ఇచ్చిన మాటకు కట్టుబడిన వ్యాపార దిగ్గజం.. దత్తాత్రేయ కుటుంబానికి బొలెరో వాహనాన్ని అందించింది. ‘తన వాహనాన్ని ఎక్స్ఛేంజ్ చేసుకునే ప్రతిపాదనను అంగీకరించినందుకు ఆనందంగా ఉంది. ఆ కుటుంబం బొలెరోను అందుకుంది. ఆయన సృష్టించిన దానికి గర్విస్తున్నాం. మమ్మల్ని ఉత్తేజపరిచేందుకు ఇది మా రీసెర్చ్ వ్యాలీలోని అన్ని రకాల కార్ల సేకరణలో భాగంగా ఉంటుంది’ అంటూ ట్వీట్ చేశారు. తన సంస్థ ప్రతినిధులు దత్తాత్రేయ కుటుంబానికి బొలెరోను అందిస్తున్న ఫొటోలను ఆ ట్వీట్కు జోడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
-
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల