Lakhimpur Kheri: లఖింపుర్ ఘటనలో మరో ఛార్జ్షీట్.. రైతులపైనా అభియోగాలు..!
ఉత్తరప్రదేశ్లోని లఖింపుర్ ఖేరీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు సంబంధించిన కేసులో మరో ఛార్జ్షీట్ దాఖలైంది. ఇప్పటికే రైతులపైకి వాహనం ఎక్కించినందుకు
లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్లోని లఖింపుర్ఖేరీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు సంబంధించిన కేసులో మరో ఛార్జ్షీట్ దాఖలైంది. ఇప్పటికే రైతులపైకి వాహనం ఎక్కించినందుకు గానూ కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ప్రత్యేక దర్యాప్తు బృందం తొలి ఛార్జ్షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే ఘటనలో భాజపా కార్యకర్తలు, వాహనం డ్రైవర్పై జరిగిన దాడికి సంబంధించి ఏడుగురు రైతులపైనా అభియోగాలు మోపుతూ రెండో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ రైతులను పోలీసులు అరెస్టు చేశారు.
అక్టోబరులో సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై ఆశిష్ మిశ్రా కారు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో నలుగురు రైతులు, ఓ జర్నలిస్టు మృతి చెందారు. రైతులపై వాహనం దూసుకెళ్లడంతో ఆగ్రహం చెందిన రైతులు కారు డ్రైవర్, అందులోని వారిపై దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు భాజపా కార్యకర్తలు, కారు డ్రైవర్ మరణించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు అప్పట్లో సోషల్మీడియాలో వైరల్ అవడంతో అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుప్రీంకోర్టు జోక్యంతో లఖింపుర్ ఖేరీ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైంది. ఘటనపై దర్యాప్తు జరిపిన సిట్ సంచలన విషయాలను వెల్లడించింది. ఇది నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల జరిగింది కాదని, ముందస్తు ప్రణాళికతో చేసిన కుట్రే అని స్పష్టం చేసింది. ఈ కేసులో ఆశిష్ మిశ్రాను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఇటీవల 5000 పేజీల ఛార్జ్షీట్ను దాఖలు చేసింది.
ఇక రైతులపై దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానిక భాజపా కార్యకర్త ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏడుగురు రైతులను అరెస్టు చేసి విచారించారు. ఈ రైతులపై అభియోగాలు మోపుతూ ఛార్జ్షీట్ దాఖలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..