Delta Fear: ఆ దేశాల్లో మళ్లీ ఆంక్షలు!
డెల్టా వేరియంట్తో అప్రమత్తమైన ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్ దేశాలు తాజాగా మరోసారి ఆంక్షలను విధిస్తున్నట్లు ప్రకటించాయి.
డెల్టా భయంతో వణుకుతున్న ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్
సిడ్నీ: ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తున్న సమయంలో ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్ వంటి దేశాలు మాత్రం వైరస్ వ్యాప్తిని కట్టడి చేయగలిగాయి. అంతేకాకుండా అక్కడ వ్యాక్సిన్ పంపిణీని వేగంగా చేపడుతున్నాయి. ఈ సమయంలో కొత్తగా వచ్చిన డెల్టా వేరియంట్ మళ్లీ విజృంభించడం మొదలుపెట్టింది. దీంతో అప్రమత్తమైన ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్ దేశాలు తాజాగా మరోసారి ఆంక్షలను విధిస్తున్నట్లు ప్రకటించాయి. సిడ్నీలో వారంపాటు లాక్డౌన్ విధించారు. డెల్టా వేరియంట్ ఆఫ్రికాలోనూ విలయం సృష్టిస్తున్నట్లు అక్కడి సీడీసీ వెల్లడించింది. ఇప్పటికే డెల్టా వేరియంట్ దాటికి భారత్ కూడా వణికిపోయిన విషయం తెలిసిందే.
సిడ్నీలో లాక్డౌన్..
కరోనా నుంచి కోలుకుంటున్నామని భావిస్తున్న తరుణంలో కొత్తగా వెలుగుచూసిన డెల్టా వేరియంట్ ఆస్ట్రేలియాను కలవరపెడుతోంది. దీంతో సిడ్నీలో లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒకవారం పాటు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించింది. ఆస్ట్రేలియాలో గతవారంలోనే 65 పాజిటివ్ కేసులను గుర్తించారు. కరోనా మహమ్మారి బయటపడిన తర్వాత అత్యంత భయంకరమైన పరిస్థితిని ఇప్పుడే చూస్తున్నామని న్యూసౌత్వేల్స్ ప్రీమియర్ గ్లాడీస్ బెరెజిక్లెయిన్ పేర్కొన్నారు.
ఇండోర్లోనూ మాస్కులు: ఇజ్రాయెల్
ప్రపంచంలో అత్యధిక వేగంగా టీకా పంపిణీ చేస్తున్న దేశాల్లో ఇజ్రాయెల్ ముందున్న విషయం తెలిసిందే. దీంతో వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చిందని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో ఇండోర్ ప్రదేశాల్లో మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని పదిరోజుల క్రితం ఇజ్రాయెల్ ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ నిర్ణయం తీసుకున్న నాలుగు రోజులకే నిత్యం వంద కేసులు బయటపడడం మొదలయ్యింది. కేవలం గురువారం ఒక్కరోజు 227 కేసులు వెలుగుచూశాయి. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్, మాస్కుల నిబంధన సడలింపును ఎత్తివేసింది. ఇండోర్ ప్రాంతంలో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశించింది. అంతేకాకుండా పరిస్థితిని బట్టి మరిన్ని ఆంక్షలు విధించాలని యోచిస్తోంది. దేశంలో వైరస్ విజృంభణకు డెల్టా వేరియంట్ కారణం కావచ్చని ఇజ్రాయెల్లో కరోనాపై ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్ఫోర్స్ చీఫ్ పేర్కొన్నారు.
ఫిజీలోనూ అదే తీరు..
కరోనా వైరస్ వెలుగు చూసిన తొలినాళ్లలో మహమ్మారిని కట్టడి చేయడంలో ఫిజీ విజయం సాధించింది. గడిచిన ఏడాది కాలంగా అక్కడ పాజిటివ్ కేసుల జాడ కనిపించలేదు. కానీ, తాజాగా అక్కడి కొవిడ్ ఉద్ధృతి మళ్లీ మొదలయ్యింది. గురవారం ఒక్కరోజే 300 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఏప్రిల్ నెలలో వెలుగు చూసిన డెల్టా వేరియంట్తో మళ్లీ విజృంభణ మొదలైనట్లు అక్కడి అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం వైరస్ సామాజిక వ్యాప్తి దశకు చేరుకుందని ఫిజీ ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. దీంతో మరోసారి కొవిడ్ కట్టడి ఆంక్షలకు ఉపక్రమించారు.
ఆఫ్రికాలో థర్డ్వేవ్..
డెల్టా వేరియంట్ ఉద్ధృతితో ఆఫ్రికా దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటివరకు 14 దేశాల్లో ఈ వేరియంట్ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా గడిచిన మూడు వారాలుగా వైరస్ విజృంభణ మరింత ఎక్కువైనట్లు ఆయా దేశాలు వెల్లడిస్తున్నాయి. ఆఫ్రికా ఖండాన్ని మూడో వేవ్ తాకిందని ఆఫ్రికాలోని వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రం (ఆఫ్రికా సీడీసీ) డైరెక్టర్ జాన్ కెంగాసాంగ్ వెల్లడించారు. ఈ ధఫా విజృంభణతో మరింత దారుణ పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. డెల్టా వేరియంట్ ప్రభావం కాంగో, ఉగాండాలో మరింత ఎక్కువగా ఉన్నట్లు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.