ల్యాబ్ లీకా? ఎలా నమ్మారో జనం: బ్యాట్ ఉమన్
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి ముమ్మాటికీ చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే లీకైందనే వాదనలు రోజురోజుకీ బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ల్యాబ్ లీక్ వివాదంలో ముందు
వుహాన్: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి ముమ్మాటికీ చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే లీకైందనే వాదనలు రోజురోజుకీ బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ల్యాబ్ లీక్ వివాదంలో ముందు నుంచి కేంద్రబిందువుగా మారిన చైనా ప్రముఖ వైరాలజిస్టు, బ్యాట్ ఉమన్ షీ ఝెంగ్లీ ఎట్టకేలకు ఈ వాదనలపై స్పందించారు. అయితే యథావిధిగా ల్యాబ్ నుంచి ఎలాంటి వైరస్ లీక్ కాలేదని చెప్పడం గమనార్హం. వూహాన్ ల్యాబ్ నుంచే వైరస్ లీకయిందనేందుకు బలమైన ఆధారాలు బయటపడుతుండటంతో తమ బండారం బయటపడకుండా చైనా యంత్రాంగం బ్యాట్ఉమెన్ను రంగంలోకి దించినట్టు పాశ్చాత్య నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. తాజాగా ల్యాబ్ లీక్ సిద్ధాంతాన్ని తీవ్రంగా ఖండించిన ఆమె.. కరోనా విపత్తుకు తమ సంస్థ కారణం కాదని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్కు అరుదైన ఇంటర్వ్యూ ఇచ్చారు. మూములుగా చైనా శాస్త్రవేత్తలు గానీ అధికారులు గానీ మీడియాతో మాట్లాడేందుకు సాహసించరు. అయితే బ్యాట్ఉమన్ ఇంటర్వ్యూ ఇవ్వడం వెనుక ప్రభుత్వ యంత్రాంగం ఉందని అనుమానాలు కలుగుతున్నాయి.
‘‘అసలు ఈ భూమ్మిద రుజువులే లేనిదానికి సాక్ష్యాలు ఇస్తానని నేనెలా చెప్పగలను? అమాయకమైన శాస్త్రవేత్తలపై ప్రపంచం ఎలా దుమ్మెత్తిపోయగలుగుతుందో నాకు అర్థం కావట్లేదు’’ అని షీ ఝెంగ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరస్ల సామర్థ్యాన్ని పెంచే గెయిన్ ఆఫ్ ఫంక్షన్ ప్రయోగాలను వుహాన్ ల్యాబ్ ఎన్నడూ జరపలేదని, అలాంటి వాటికి సహకారం కూడా అందించలేదని చెప్పారు. వుహాన్ ల్యాబ్లో కరోనా వైరస్ ఉన్న గబ్బిలాలపై తన ప్రయోగాలు.. గెయిన్ ఆఫ్ ఫంక్షన్ లాంటివి కావని, ఎందుకంటే వైరస్ను మరింత ప్రమాదరకంగా మార్చే పరిశోధనలేవీ తాను చేయలేదని తెలిపారు. కేవలం ఈ వైరస్ రకాలు ఒక జీవి నుంచి మరో జీవికి ఎలా వ్యాపిస్తాయో తెలుసుకునేందుకు మాత్రమే ప్రయోగాలు జరిపామన్నారు.
మరోవైపు కరోనాకు ముందు 2019 నవంబరులో వుహాన్ ల్యాబ్లోని కొందరు అనారోగ్యానికి గురైనట్లు వచ్చిన వార్తలను కూడా ఝెంగ్లీ తోసిపుచ్చారు. తమ ల్యాబ్లో అలాంటి కేసులేమీ వెలుగుచూడలేదని చెప్పిన ఆమె.. ‘‘సాధ్యమైతే ఆ సిబ్బంది పేర్లు చెప్పండి మేం చెక్ చేస్తాం’’ అని చెప్పారు. కరోనా మూలాలపై దర్యాప్తులో ప్రపంచ ఆరోగ్య సంస్థకు కూడా తమ ల్యాబ్ పూర్తి సహకారం అందించిందని ఆమె అన్నారు. తమపై ఉన్న అపనమ్మకం కారణంగానే ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని ఆరోపించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, అందువల్ల ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని బ్యాట్ ఉమన్ చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది.
వాస్తవానికి కరోనా.. వుహాన్ ల్యాబ్లో పుట్టిందనే వాదనలకు ఝెంగ్లీ గతంలో రాసుకొచ్చిన కొన్ని రీసర్చ్ పేపర్లే కారణమనేది కొట్టిపారేయలేని నిజం. 2017లో ఝెంగ్లీ, తన సహ పరిశోధకులు వుహాన్ ల్యాబ్ పరిశోధనలపై ఓ పేపర్ పబ్లిష్ చేశారు. మిక్స్ అండ్ మ్యాచ్ విధానంలో హైబ్రిడ్ గబ్బిలాల నుంచి కరోనా వైరస్లను సృష్టించినట్లు అందులో వారు రాసుకొచ్చారు. ఇందులో కొన్ని వైరస్లు మానవులకు వ్యాప్తి చెందే అవకాశమున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో వచ్చే మహమ్మారుల నుంచి రక్షణ కల్పించడం కోసమే ఇలాంటి వైరస్లను సృష్టించారని కొందరు చెబుతున్నా.. వీటి వల్ల మానవాళికి పెను ప్రమాదం పొంచి ఉందని విమర్శకులు హెచ్చరిస్తూనే ఉన్నారు.
ఇదిలా ఉండగా.. వుహాన్ ఇనిస్టిట్యూట్లో అత్యంత భద్రమైన బయోసేఫ్టీ లెవల్ 4 ల్యాబ్లు ఉన్నాయి. అయిన్పటికీ షీ ఝెంగ్లీ మాత్రం గబ్బిలాలపై తన పరిశోధనల్లో కొన్నింటిని బయో సేఫ్టీ లెవల్ 2 ల్యాబ్ల్లో జరిపినట్లు తెలిసింది. ఇక్కడ భద్రత తక్కువగా ఉంటుండటంతో వ్యాధికారక వైరస్లు బయటకు వెళ్లే అవకాశం లేకపోలేదు. అయితే ఈ వైరస్లు మానవులకు నేరుగా వ్యాపిస్తాయని చెప్పేందుకు ఆధారాలు లేవని, అందుకే తాను బీఎస్ఎల్-2 ల్యాబ్ల్లో పరిశోధనలు జరిపానని బ్యాట్ఉమన్ చెప్పడం గమనార్హం.
ఎవరీ బ్యాట్ఉమన్..
57 ఏళ్ల ఝెంగ్లీ వుహాన్ ల్యాబ్లో అత్యంత సీనియర్ వైరాలజిస్టు. గబ్బిలాలపై ప్రమాదకర పరిశోధనలు చేస్తుండటంతో ఆమెకు బ్యాట్ ఉమన్గా పేరొచ్చింది. 2004లో ప్రపంచవ్యాప్తంగా సార్స్ మహమ్మారి వ్యాప్తి చెందిన తర్వాత ఈమె గబ్బిలాలపై తన పరిశోధనలు ప్రారంభించారు. 2011లో చైనాలోని ఓ గుహను సందర్శించిన ఆమె.. అక్కడి గబ్బిలాల్లో సార్స్ తరహా కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమె పేరు ప్రపంచవ్యాప్తంగా తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం. -
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!