Covaxin: ప్రైవేటులో ధర ఎక్కువే.. ఎందుకంటే..!
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా ప్రైవేటులో ఎక్కువ ధరకు విక్రయిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు గల కారణాలను పేర్కొంటూ భారత్ బయోటెక్ వివరణ ఇచ్చింది.
స్పష్టతనిచ్చిన భారత్ బయోటెక్
దిల్లీ: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా ప్రైవేటులో ఎక్కువ ధరకు విక్రయిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు గల కారణాలను పేర్కొంటూ భారత్ బయోటెక్ వివరణ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి కొవాగ్జిన్ టీకా ఒక డోసును రూ. 150కే ఇస్తున్నామని భారత్ బయోటెక్ పేర్కొంది. దీర్ఘకాలం ఇలా తక్కువ ధరకు సరఫరా చేయడం సాధ్యపడదని అభిప్రాయపడింది. అక్కడ జరిగిన కొంత నష్టాన్ని భర్తీ చేసేందుకే ప్రైవేటు మార్కెట్లో అధిక ధరకు విక్రయించాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొంది. అందుచేత ప్రైవేటు రంగానికి సరఫరా చేసే టీకాల ధర తగ్గించలేమని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. ఇక టీకా ఉత్పత్తిలో కేవలం పది శాతం కంటే తక్కువే ప్రైవేటుకు ఇస్తున్నామని భారత్ బయోటెక్ వెల్లడించింది.
‘వ్యాక్సిన్ ధరను నిర్ణయించడంపై వివిధ అంశాలు ఆధారపడి ఉంటాయి. వ్యాక్సిన్ తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలే కాకుండా తయారీ కేంద్రాల్లో సదుపాయాలు, ఉత్పత్తి సమయంలో సంభవించే వైఫల్యాలు, సరఫరా ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వ్యాక్సిన్ తయారీని అత్యంత సురక్షిత పద్ధతుల్లో చేయడం భారీ శ్రమతోపాటు ఖర్చుతో కూడకున్న పని’ అని భారత్ బయోటెక్ పేర్కొంది. అంతేకాకుండా కొవాగ్జిన్ టీకా ప్రతి బ్యాచ్ ఉత్పత్తి అయిన తర్వాత, మార్కెట్లోకి విడుదలకు ముందు దాదాపు 200 రకాల నాణ్యతా పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలా వ్యాక్సిన్ తయారీ అత్యంత క్లిష్టమైనది కాబట్టే చాలా కంపెనీలు టీకాల అభివృద్ధికి ముందుకు రావు. తక్కువ మొత్తంలో సేకరించడం, సరఫరా ఖర్చులు ఎక్కువగా ఉండడంతోపాటు పైన పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రభుత్వానికి, భారీ ఎత్తున వ్యాక్సిన్ సేకరించే వారితో పోలిస్తే ప్రైవేటు మార్కెట్లో కొవాగ్జిన్ను ఎక్కువ ధరకు విక్రయించాల్సి వస్తోందని భారత్ బయోటెక్ తెలిపింది.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, వ్యాక్సిన్ ఉత్పత్తిలో కేవలం పదిశాతం కంటే తక్కువ మొత్తాన్ని మాత్రమే ప్రైవేటు ఆస్పత్రులకు సరఫరా చేస్తున్నామని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. మిగతావన్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే అందిస్తున్నామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వమే అర్హులందరికీ వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తున్నందున.. ప్రైవేటు సంస్థలు వ్యాక్సిన్ సరఫరా చేయడం తప్పనిసరేం కాదని పేర్కొంది. అది ఆయా ఆస్పత్రుల ఇష్టంపైనే ఆధారపడి ఉంటుందని భారత్ బయోటెక్ అభిప్రాయపడింది.
ఇదిలా ఉంటే, ప్రైవేటు ఆస్పత్రుల్లో అందించే కరోనా వ్యాక్సిన్ల ఒక్కో డోసు ధరలను కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యే ప్రకటించింది. ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారం.. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా అసలు ధర ₹1200గా ఉంది. ఐదుశాతం జీఎస్టీ, రూ.150 సర్వీస్ ఛార్జితో సహా అన్ని పన్నులు కలుపుకొని గరిష్ఠ ధర ₹1410 అవుతుంది. ఇక కొవిషీల్డ్ వ్యాక్సిన్ ధర ₹600కాగా పన్నులతో కలిపి గరిష్ఠంగా ₹780గా ఉంది. రష్యాకు చెందిన స్పుత్నిక్-వి ధర ₹1145గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ పోలింగ్ ఏజెంట్ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
Isha Arora: యూపీలో విధులు నిర్వహించిన పోలింగ్ ఏజెంట్ ఈశా అరోడా ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్గా మరారు. ఇంతకీ ఎవరామె..? -
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
Doordarshan: ‘డీడీ న్యూస్’ లోగోను కాషాయ రంగులోకి మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ‘ప్రసార భారతి’ కాదని ‘ప్రచార భారతి’గా మారిందని పలువురు మండిపడుతున్నారు. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది.
తాజా వార్తలు (Latest News)
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
-
ఈ పోలింగ్ ఏజెంట్ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
-
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
-
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ
-
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు