Rajnath Singh: స్వయంగా రక్షణమంత్రి.. వీరజవాన్ను వీల్ఛెయిర్లో తీసుకొచ్చి..
కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం తూర్పు లద్దాఖ్లో పర్యటించారు. 1962లో భారత్, చైనా మధ్య జరిగిన యుద్ధ ప్రాంతం రెజాంగ్ లాకు వెళ్లిన ఆయన అక్కడ
దిల్లీ: కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం తూర్పు లద్దాఖ్లో పర్యటించారు. 1962లో భారత్, చైనా మధ్య జరిగిన యుద్ధ ప్రాంతం రెజాంగ్ లాకు వెళ్లిన ఆయన అక్కడ పునరుద్ధరించిన యుద్ధ స్మారకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాటి యుద్ధంలో పాల్గొన్న ఓ వీర జవాన్ను రక్షణమంత్రి స్వయంగా వీల్ఛెయిర్లో స్మారకం వద్దకు తీసుకురావడం విశేషం.
1962 చైనా-ఇండియా యుద్ధంలో పాల్గొన్న బ్రిగేడియర్(రిటైర్డ్) ఆర్.వి. జాటర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే వృద్ధాప్యంలో ఉన్న ఆయనను రాజ్నాథ్ స్వయంగా వీల్ఛెయిర్ తోసుకుంటూ యుద్ధ స్మారకం వద్దకు తీసుకురావడం విశేషం. ఇందుకు సంబంధించి ఫొటోను కేంద్రమంత్రి ట్విటర్ వేదికగా పంచుకుంటూ.. ‘‘బ్రిగేడియర్ ఆర్.వి. జాటర్ను కలిసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. యుద్ధం సమయంలో ఆయన కంపెనీ కమాండర్గా వ్యవహరించారు. ఆయన ధైర్యానికి సెల్యూట్. ఆయన ఆయురారోగ్యాలతో దీర్ఘకాలం జీవించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’ అని రాసుకొచ్చారు.
రేజాంగ్ లా ప్రాంతంలో యుద్ధ స్మారకాన్ని ప్రారంభించిన రాజ్నాథ్ సింగ్.. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం అక్కడి జవాన్లతో కొంతసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘18వేల అడుగుల ఎత్తులో రేజాంగ్ లాలో జరిగిన చారిత్రక యుద్ధం గురించి ఇప్పుడు ఊహించుకున్నా ఒళ్లు గగుర్పొడుతుంది. మేజర్ షైతాన్ సింగ్, ఆయన తోటి సైనికులు తమ చివరి శ్వాస, చివరి బుల్లెట్ వరకు పోరాడారు. శౌర్య పరాక్రమాలు, త్యాగంలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఈ స్మారకం.. భారత సైన్యం అద్వితీయమైన పరాక్రమానికి నిదర్శనం. వారి ధీరత్వం చరిత్ర పుటల్లోనే కాదు ప్రతి భారతీయుడి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది’’ అని సైన్యాన్ని కొనియాడారు.
గత ఏడాదిన్నర కాలంగా తూర్పు లద్దాఖ్లో భారత్, చైనా మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. ఈ స్మారకాన్ని పునరుద్ధరించి ప్రారంభించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్