Drones: సరిహద్దుల్లో మళ్లీ డ్రోన్ కలకలం.. బీఎస్ఎఫ్ జవాన్ల కాల్పులతో పాక్ వైపు!
భారత్ - పాకిస్థాన్ సరిహద్దుల్లో అనుమానాస్పద డ్రోన్ల కదలికలు కలవరపెడుతున్నాయి. జమ్మూలోని ఆర్నియా సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దు....
శ్రీనగర్: భారత్ - పాకిస్థాన్ సరిహద్దుల్లో అనుమానాస్పద డ్రోన్ల కదలికలు కలవరపెడుతున్నాయి. జమ్మూలోని ఆర్నియా సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద సోమవారం తెల్లవారు జామున 5.30 గంటల సమయంలో ఆకాశంలో ఎరుపు, పసుపు రంగుల్లో ఓ వస్తువు మెరుస్తున్నట్టు బలగాలు గుర్తించాయని బీఎస్ఎఫ్ అధికారి వెల్లడించారు. అప్రమత్తమైన బలగాలు 25 రౌండ్లు కాల్పులు జరిపగా.. ఆ డ్రోన్ మరింత పైకి ఎగిరి పాక్ భూభాగంలోకి వెళ్లినట్టు వివరించారు. అనంతరం స్థానిక పోలీసుల సహకారంతో ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. అయితే, ఆ ప్రాంతంలో గాలింపు చర్యల్లో ఇంతవరకు ఏమీ గుర్తించలేదని బీఎస్ఎఫ్ డీఐజీ ఎస్పీఎస్ సంధు వెల్లడించారు.
జమ్మూలోని భారత వాయుసేన బేస్ లక్ష్యంగా జూన్ 27న వచ్చిన డ్రోన్ ఘటన అనంతరం ఆర్నియా సెక్టార్లో ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం అవుతుండటం గమనార్హం. జులై 24న ఐదు కిలోల పేలుడు పదార్థాలతో పాక్కు చెందిన ఓ డ్రోన్ను అక్నూరు సెక్టార్లో గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ఇది పాకిస్థాన్లోని ఉగ్రవాదుల పనేనన్న కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్.. దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ చేస్తోందని తెలిపారు. 2019 నుంచి పాక్ సరిహద్దులో 350కి పైగా అనుమానాస్పద డ్రోన్లను భద్రతా బలగాలు గుర్తించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్