Bus: గమ్యం లేని బస్సు ప్రయాణం.. నిద్రే లక్ష్యం!
రోజంతా ఎంతో కష్టపడతాం.. దీంతో అలిసిపోయి రాత్రి హాయిగా నిద్రకు ఉపక్రమించేస్తాం. కానీ, కొంతమందికి అస్సలు నిద్ర పట్టదు. అదే బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో అయితే.. వద్దన్నా నిద్ర కమ్ముకొచ్చేస్తుంది. ఈ విషయాన్ని గుర్తించిన హాంకాంగ్లో ఉలూ ట్రావెల్స్ అనే సంస్థ ‘స్లీపింగ్ బస్ టూర్’ అనే
ఇంటర్నెట్ డెస్క్: రోజంతా ఎంతో కష్టపడతాం.. దీంతో అలిసిపోయి రాత్రి హాయిగా నిద్రకు ఉపక్రమించేస్తాం. కానీ, కొంతమందికి అస్సలు నిద్ర పట్టదు. అదే బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో అయితే.. వద్దన్నా నిద్ర కమ్ముకొచ్చేస్తుంది. ఈ విషయాన్ని గుర్తించిన హాంకాంగ్లోని ఉలూ ట్రావెల్స్ అనే సంస్థ ‘స్లీపింగ్ బస్ టూర్’ పేరుతో వినూత్న సేవల్ని ప్రవేశపెట్టింది. ఇంట్లో పడకపై నిద్ర పట్టని వారు తమ బస్సులో ప్రయాణిస్తూ ఐదు గంటలపాటు నిద్రపోవచ్చని తెలిపింది. హాంకాంగ్ పరిధిలో తమ డబుల్ డెక్కర్ బస్ ఐదుగంటలపాటు 75కి.మీ మేర గమ్యం లేకుండా తిరుగుతుందని.. చివరకు ఎక్కిన చోటే దించేస్తుందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. టికెట్ ధర సీటు ఎంపికను బట్టి 13 డాలర్ల నుంచి 51 డాలర్ల వరకు ఉంటుందట. ప్రయాణికులకు కళ్లకు పెట్టుకునే మాస్క్, గూడీ బ్యాగ్, బయటి శబ్దాలు వినిపించకుండా చెవులకు ఇయర్ ప్లగ్స్ను ఇస్తారు. కాగా.. ప్రయాణికులు తమకు అనువుగా ఉండేలా రాత్రి వేసుకునే దుస్తులు, బ్లాంకెట్లు కూడా తెచ్చుకోవచ్చు. ఇటీవల ఈ సేవల్ని ప్రారంభించగా.. సీట్లన్ని నిండిపోయాయట. ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో ఉలూ ట్రావెల్స్ ఈ సేవల్ని మరింత విస్తరించే ప్రయత్నంలో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం