హత్యను దాచబోయి.. కార్చిచ్చుకు కారణమై..
గతేడాది ఆగస్టులో అమెరికాలో కాలిఫోర్నియా భారీ కార్చిచ్చు సంభవించిన విషయం తెలిసిందే. ఆ అగ్నికీలల్లో వందలాది భవంతులు కాలి బూడిదయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
కాలిఫోర్నియా: గతేడాది ఆగస్టులో అమెరికాలో కాలిఫోర్నియా భారీ కార్చిచ్చు సంభవించిన విషయం తెలిసిందే. ఆ అగ్నికీలల్లో వందలాది భవంతులు కాలి బూడిదయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వేల ఎకరాలు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే, ఆ ప్రమాదానికి కారణాలను దర్యాప్తు చేసే క్రమంలో వెలుగుచూసిన నిజాలతో పోలీసులు షాకయ్యారు. ఓ మనిషిని చంపేసి, ఆ హత్యను దాచిపెట్టే ప్రయత్నం.. కార్చిచ్చుకు దారితీసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఉత్తర కాలిఫోర్నియాలోని సొలానో కౌంటీలో గల అడవుల్లో గతేడాది ఆగస్టులో మంటలు చెలరేగాయి. అది కాస్తా అడవి మొత్తం వ్యాపించింది. అయితే సొలానో కౌంటీలో మంటలు చెలరేగిన ప్రాంతానికి సమీపంలో ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు ఆ తర్వాత గుర్తించారు. దర్యాప్తులో ఆ మృతదేహం 32ఏళ్ల ప్రిసిల్లా కాస్ట్రోగా తేలింది. అగ్నిప్రమాదానికి రెండు రోజుల ముందు విక్టర్ సెరింటినో అనే వ్యక్తితో డేట్కు వెళ్లినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. దీంతో అతడిని అరెస్టు చేశారు. ‘‘8 నెలల సుదీర్ఘ దర్యాప్తు ఆధారంగా సెరింటినో తన నేరాన్ని దాచిపెట్టేందుకు ఉద్దేశపూర్వకంగానే అడవికి నిప్పుపెట్టాడని మేం విశ్వసిస్తున్నాం’’ అని పోలీసులు తాజాగా ఇచ్చిన ప్రకటనలో వెల్లడించారు.
సొలానో కౌంటీలో మొుదలైన మంటలు క్రమక్రమంగా విస్తరించాయి. అదే సమయంలో అడవిలోని కొన్నిచోట్ల పిడుగులు పడటంతో మరిన్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో భారీ కార్చిచ్చు సంభవించింది. కాలిఫోర్నియా చరిత్రలోనే అతిపెద్ద కార్చిచ్చుల్లో ఒకటిగా మిగిలింది. మంటల ఉద్ధృతికి వేల సంఖ్యలో భవనాలు కాలిపోయాయి. దాదాపు 3.63లక్షల ఎకరాల్లో చెట్లు బూడిదయ్యాయి. సుమారు ఐదు లక్షల మంది ఆ ప్రాంతాన్ని వదిలివెళ్లాల్సి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం