అసెంబ్లీ పోల్స్: కీలక సమరానికి ముగిసిన ప్రచారం!
ఐదు రాష్ట్రాల్లో జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. ఇక తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలు కీలక సమరానికి సిద్ధమయ్యాయి.
తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే విడతలో పోలింగ్
దిల్లీ: మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలు కీలక సమరానికి సిద్ధమయ్యాయి. ఈ మూడు రాష్ట్రాల్లో అన్ని అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 6వ తేదీన ఒకే విడతలో ఎన్నికల పోలింగ్ జరగనుంది. అస్సాంలో మాత్రం మూడో విడత పోలింగ్ జరుగనుంది. దీంతో అక్కడ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుండగా, పశ్చిమ బెంగాల్లో మాత్రం ఇది కాకుండా, మరో ఐదు విడతల్లో పోలింగ్ జరగనుంది.
ఏప్రిల్ 6న నాలుగు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనున్నాయి. కీలకమైన తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు.. అటు కేరళ (140), పుదుచ్చేరి (30)లోనూ అదే రోజు ఎన్నికల పోలింగ్ జరగనుంది. పశ్చిమ బెంగాల్, అస్సాంలలో ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్ పూర్తికాగా, 6వ తేదీన మూడో విడత పోలింగ్ జరుగుతుంది. పశ్చిమబెంగాల్లో 31 స్థానాలు, అస్సాంలో 40 అసెంబ్లీ స్థానాలు పోలింగ్కు సిద్ధమయ్యాయి. అస్సాంలో ఇదే చివరి విడత కాగా, బెంగాల్లో మరో ఐదు విడతల్లో ఎన్నికలు జరుగుతాయి.
హోరాహోరీ ప్రచారం..
తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం రాజకీయ పార్టీలు హోరాహోరీ ప్రచారం నిర్వహించాయి. తమిళనాడులో మూడోసారి అధికారాన్ని కొనసాగిస్తామని అన్నాడీఎంకే ధీమా వ్యక్తం చేస్తుండగా, ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేపట్టాలని డీఎంకే కూటమి ప్రయత్నిస్తోంది. కేరళలో అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్ కూటములు గెలుపుపై ధీమాతో ఉన్నాయి. ఇదే సమయంలో రెండు కూటములతో ప్రజలు విసుగు చెందారని, ఈ రెండింటికి ప్రత్యామ్నాయంగా ప్రజలు భాజపా వైపే మొగ్గుచూపుతున్నారని కాషాయ పార్టీ చెప్పుకుంటోంది. ఇక పుదుచ్చేరిలోనూ ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేతలు ముమ్మర ప్రచారం నిర్వహించారు. పశ్చిమ బెంగాల్, అస్సాంలలోనూ జాతీయ, ప్రాంతీయ పార్టీలు విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!