‘అప్పటి వరకు యాత్రికులు వారణాసికి రావద్దు’
కరోనా వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో కొద్ది రోజుల పాటు వారణాసి పర్యటనకు యాత్రికులు దూరంగా ఉండాలంటూ జిల్లా యంత్రాంగం సూచించింది. దేశీయ, విదేశీ యాత్రికులు ఏప్రిల్ నెలలో తమ పర్యటనను రద్దు చేసుకుంటే మంచిదని పేర్కొంది.
లఖ్నవూ: కరోనా వైరస్ వ్యాప్తి ఉద్ధృతి నేపథ్యంలో కొద్ది రోజుల పాటు వారణాసి పర్యటనకు యాత్రికులు దూరంగా ఉండాలంటూ జిల్లా యంత్రాంగం సూచించింది. యాత్రికులు ఏప్రిల్ నెలలో తమ పర్యటనను రద్దు చేసుకుంటే మంచిదని పేర్కొంది. ఈ మేరకు జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్ రాజ్ శర్మ ప్రకటన విడుదల చేశారు. ‘కరోనా వైరస్ కేసుల ఉద్ధృతి దృష్ట్యా ఏప్రిల్లో యాత్రికులు వారణాసి పర్యటనను రద్దు చేసుకోవాలని కోరుతున్నాం. ఒకవేళ ఎవరైనా ఆలయ దర్శనానికి వస్తే ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకొని నెగెటివ్ రిపోర్టు తీసుకురావాలి’ అని శర్మ తెలిపారు.
‘కరోనా వ్యాప్తి నివారణకు కఠిన చర్యలు తీసుకుంటున్నాం. పరిసర జిల్లాల ప్రజలు అనవసరంగా వారణాసికి రావద్దు. కాశీ ఆలయ దర్శనానికి ముందు మూడ్రోజుల్లోపు ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేయించుకొని నెగెటివ్ రిపోర్టు తీసుకురావాలి. లేకపోతే ఆలయ ప్రవేశానికి అనుమతి లభించదు’ అని వారణాసి జిల్లా కమిషనర్ దీపక్ అగర్వాల్ తెలిపారు.
వారణాసి జిల్లాలో ప్రస్తుతం 10,206 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర రాజధాని లఖ్నవూ, ప్రయాగ్రాజ్ తర్వాత ఇక్కడే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. కాశీ నగరంలో మార్చి 31న 550 యాక్టివ్ కేసులు ఉండగా.. నిన్నటికి ఆ సంఖ్య 1,585కి చేరింది. ఇప్పటికే నగరంలో నైట్ కర్ఫ్యూ విధించారు. అంతేకాకుండా గంగా ఘాట్లలోకి సాయంత్రం 4 నుంచి ఉదయం 6గంటల వరకు ప్రవేశాన్ని నిషేధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..