ప్రకృతిలో మార్పులా సమాజం మారుతోంది: ఒబామా
అమెరికాలోని కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు శాన్ఫ్రాన్సిస్కో తీర ప్రాంతంపై తీవ్ర ప్రభావం పడింది...
కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు శాన్ఫ్రాన్సిస్కో తీర ప్రాంతంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. కార్చిచ్చు కారణంగా మంటలు ఎగసిపడ్డాయి. అగ్నికీలలు నుంచి వెలువడిన దట్టమైన పొగ కారణంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నీలిరంగులో ఉండాల్సిన ఆకాశం నారింజ రంగులోకి మారింది. మధ్యాహ్నం కావస్తున్నా ఆకాశమంతా మబ్బులు కమ్ముకున్నట్లుగా చీకటిగానే కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను అమెరికన్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విటర్లో షేర్ చేశారు.
'వెస్ట్ కోస్ట్ ప్రాంతమంతటా మంటలంటుకొని వాతావరణం పూర్తిగా నారింజ రంగులోకి మారిపోయింది. ప్రకృతి ప్రకోపంతో ఇలా మారిపోయినట్లే మన సమాజం కూడా అంతే వేగంగా మారుతుందనడానికి ఇది ఒక ఉదాహరణ. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రకృతిని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో.. మన భవిష్యత్తును కాపాడుకోవడంలో ఓటుకు అంతే ప్రాధాన్యం ఉంటుంది’’ అని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒబామా చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్