Chennai Floods: అధికారులూ... 2015 నుంచి అసలేం పని చేస్తున్నారు?
తమిళనాడు రాజధాని చెన్నైతో పాటు పలు జిల్లాల్లో కురిసిన వర్షాలకు ఆయా ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈనేపథ్యంలో అక్కడి మద్రాసు హైకోర్టు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్పై మండిపడింది. వర్షాల వేళ నగరంలో వరదల నివారణకు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైయ్యారని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ని విమర్శించింది .
పాలన తీరుపై ప్రశ్నించిన మద్రాస్ హైకోర్టు
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైతో పాటు వివిధ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు ఆయా ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్పై మద్రాసు హైకోర్టు మండిపడింది. వర్షాల వేళ నగరంలో వరదల నివారణకు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైయ్యారని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ను విమర్శించింది. 2015లో తొలిసారి చెన్నైకి వరదలు ముంచెత్తాయి. ఆరేళ్ల నుంచి చెన్నై వరుసగా వరదలతో ఇబ్బంది పడుతుంటే.. అధికారులు ఏమి చేస్తున్నారంటూ న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రస్తుత పరిస్థితిని అదుపులోకి తీసుకురాకపోతే విషయాన్ని సుమోటోగా పరిగణించి చర్యలు తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించింది.
‘‘ఏడాదిలో సగం రోజులు నీటి కోసం వెతుక్కునే పరిస్థితి ఉంటే.. మిగతా సగం నీళ్లలోనే చచ్చిపోయే పరిస్థితులు ఉంటున్నాయి. దేశంలోనే అగ్రగామి రాష్ట్రం ఇలాంటి స్థితిలో ఉండకూడదు’’
- జస్టిస్ సంజీబ్ బెనర్జీ,మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
చెన్నైతో పాటు చంగళ్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లోని శివారు ప్రాంతాల్లో శనివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఒక్క రోజే 210 మీమీ వర్షపాతం నమోదైంది. దీంతో ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు ఐదుగురు మరణించగా, 260 గుడిసెలు, 70 ఇళ్లు దెబ్బతిన్నాయి. రానున్న రోజుల్లోనూ చెన్నై, పొరుగు జిల్లాల్లో తీవ్ర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా