చైనా ముందు ‘వృద్ధ’ సంక్షోభం!
చైనాలో పెరిగిపోతోన్న వృద్ధ జనాభా సంరక్షణ అక్కడి ప్రభుత్వానికి తలకుమించిన భారంగా మారుతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
వెలుగుచూస్తోన్న ‘సంరక్షణ కేంద్రాల’ మోసాలు
వాషింగ్టన్: ప్రపంచ దేశాలను సంక్షోభంలోకి నెట్టిన చైనా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నట్లు ఈ మధ్యే వచ్చిన నివేదికలు వెల్లడిస్తున్నాయి. అమెరికాతో పాటు భారత్ వంటి దేశాలతో ఘర్షణ వాతావరణానికి దిగుతోన్న చైనా, స్థానికంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అక్కడ పెరిగిపోతోన్న వృద్ధ జనాభా సంరక్షణ చైనాకు తలకుమించిన భారంగా మారుతున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వృద్ధాప్యంలో వారి సంరక్షణ కోసం అవసరమైన గదుల్లో కొరత, వాటి నిర్వహణలో వెలుగుచూస్తున్న మోసాలు చైనాకు మరో సవాలుగా మారాయని వృద్ధ జనాభా, సవాళ్లపై అధ్యయనాలు జరుపుతోన్న నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా మొన్నటివరకు ‘ఒక్కరే ముద్దు’ అంటూ కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించింది. కానీ, జనాభాలో వ్యత్యాసం ఎక్కువ కావడంతో అప్రమ్తమైన డ్రాగన్ దేశం, పిల్లలు కనడంపై ఉన్న ఆంక్షలను సడలించింది. అయితే, 2050 నాటికి చైనాలో దాదాపు సగం మంది 60ఏళ్ల వయసుపైబడిన వారే ఉంటారని అక్కడి ప్రభుత్వం అంచనా వేసింది. ఇది ప్రభుత్వానికి తీవ్ర భారంగా మారే ప్రమాదం ఉందని చైనా ముందుగానే పసిగట్టింది. ఇప్పటికే పెరిగిపోతున్న వృద్ధుల సంరక్షణ కోసం ప్రత్యేక కేంద్రాలను నెలకొల్పేందుకు సిద్దమైంది. అయితే, వృద్ధుల సంరక్షణ సవాళ్లు మోసగాళ్లకు, పోంజీ వంటి పెట్టుబడి పథకాలకు ద్వారాలు తెరిచినట్లు అయ్యిందని చైనా ప్రభుత్వం తలపట్టుకుంటోంది. ఈ తరహా మోసాలు ఇప్పటికే వందల సంఖ్యలో వెలుగు చూశాయని, ప్రస్తుతం ప్రభుత్వం వీటిపై దర్యాప్తు జరుపుతోందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇందులో భాగస్వామ్యమైన కంపెనీలను కూడా చైనా అధికారులు విచారిస్తున్నట్లు పేర్కొంది.
చైనాలో వయసుపైబడిన వారి పర్యవేక్షణను సాధారణంగా వారి కుటుంబ సభ్యులే చూసుకుంటారు. అయితే, బతుకుదెరువు, ఉద్యోగాల కోసం భారీ స్థాయిలో ప్రజలు పట్టణాలు, నగరాలకు వలస వెళుతుండడంతో వృద్ధులు మాత్రం వారి ఇళ్లలో ఒంటరిగానే మిగిలిపోతున్నారు. ముఖ్యంగా చైనా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం, 2016 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో కోటి 60లక్షల మంది ఒంటరిగా ఉంటున్నట్లు తేలింది. ఇలా కుటుంబం, ఆర్థిక స్తోమత, పనిచేసేశక్తి..ఈ మూడు లేనివారి కోసం ప్రభుత్వమే సంరక్షణ బాధ్యత చూసుకునే ఏర్పాట్లు చేస్తోంది.
పెరిగిన ప్రైవేటు మోసాలు..!
‘దేశంలో వృద్ధుజనాభా క్రమంగా పెరిగిపోతోంది. వీరి సంరక్షణ చూసుకునేందుకు ప్రభుత్వం నిధులతో చేపడుతోన్న కార్యక్రమాలు ఏమాత్రం సరిపోవడం లేదు’ అని యూనివర్సిటీ ఆఫ్ చైనాకు చెందిన ప్రొఫెసర్ డాంగ్ కెయోంగ్ వెల్లడించారు. ఇలాంటి సంరక్షణ కేంద్రాలు నెలకొల్పేందుకు ప్రైవేటు భాగస్వామ్యాన్ని కోరిన ప్రభుత్వం, వారికి పన్నుల్లో రాయితీ, సబ్సిడీలను అందిస్తోంది. అయితే, ప్రభుత్వం చెల్లించే దానికంటే నిర్వహణ ఖర్చు ఎక్కువ అవుతుండడంతో ప్రైవేటు సంస్థలు, బిల్డర్లు నిబంధనలను అతిక్రమిస్తున్నారు. అక్రమ మార్గంలో లబ్ధిదారులకు నేరుగా ఇంటిని లేదా గదిని కేటాయించడంతో పాటు పలు సందర్భాల్లో వృద్ధులను మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు. జీవితాంతం కష్టపడి కూడబెట్టిన సంపాదన చివరకు మోసగాళ్ల చేతుల్లో పెట్టి నష్టపోయిన ఓ వృద్ధుడు నదిలో దూకి ప్రాణాలు తీసుకున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇలాంటి మోసాల ఘటనలు ఎక్కువైన నేపథ్యంలో చైనా ప్రభుత్వం అక్కడి ప్రైవేటు సంస్థలు, మోసగాళ్లపై విచారణ జరుపుతోంది. అంతేకాకుండా భవిష్యత్తులో వృద్ధ జనాభా మరింత పెరుగనున్న నేపథ్యంలో వారి సంరక్షణ కోసం కొత్త నిబంధనలను తీసుకొచ్చేందుకు చైనా ప్రయత్నిస్తున్నట్లు అక్కడి నిపుణులు పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే బలమైన, స్థిర ప్రభుత్వం అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
తనకు జైల్లో ఇన్సులిన్ అందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. -
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్