గల్వాన్ ఘటన.. చైనా వీడియో
లద్దాఖ్లోని గల్వాన్ లోయలో గతేడాది భారత్- చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన ఓ వీడియోను డ్రాగన్ దేశం తాజాగా విడుదల చేసింది. ఇరు దేశాల బలగాల ఉపసంహరణ ప్రక్రియ జరుగుతున్న వేళ ఈ వీడియో...
దిల్లీ: లద్దాఖ్లోని గల్వాన్ లోయలో గతేడాది భారత్- చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన ఓ వీడియోను డ్రాగన్ దేశం తాజాగా విడుదల చేసింది. ఇరు దేశాల బలగాల ఉపసంహరణ ప్రక్రియ జరుగుతున్న వేళ ఈ వీడియో విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. జూన్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆ దేశ అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ విడుదల చేసింది. భారత బలగాలే చైనా వైపు దూసుకొచ్చినట్లు అందులో పేర్కొంది. ఇరు దేశాల సైన్యాలు వాగ్వాదం జరిగినట్లు అందులో కనిపించింది. ఈ ఘర్షణలో నలుగురు చైనా సైనికులు మరణించారని, వారికి నివాళులర్పిస్తున్నట్లు చైనా పేర్కొంది. అయితే, ఇదే దాడి ఘటనలో తెలంగాణకు చెందిన కర్నల్ సంతోష్బాబుతో పాటు మరో 19 మంది అమరులైన సంగతి తెలిసిందే. చైనాకు చెందిన 30 మంది సైనికులు ఈ ఘటనలో మరణించినట్లు భారత సైన్యం చెబుతుండగా.. కేవలం నలుగురు మాత్రమే మరణించినట్లు చైనా ప్రకటించడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!