Covaxin: కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి WHO అనుమతి
కరోనా మహమ్మారిపై పోరాడేందుకు దేశీయ ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) అనుమతి లభించింది.
జెనీవా: కరోనా మహమ్మారిపై పోరాడేందుకు దేశీయ ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) అనుమతి లభించింది. ఈ టీకాను అత్యవసర వినియోగ జాబితాలో (ఎమర్జెన్సీ యూజ్ ఆఫ్ లిస్టింగ్-ఈయూఎల్) చేర్చేందుకు డబ్ల్యూహెచ్వో ఆమోదం తెలిపింది. ఈ మేరకు బుధవారం డబ్ల్యూహెచ్వో ట్వీట్ చేసింది. ఈ గుర్తింపు వల్ల ఈ టీకాను ప్రపంచ దేశాలకు అందించే వీలు కలుగుతుంది. అలానే ఈ టీకాను తీసుకున్న ఇక్కడి పౌరులు విదేశాలకు వెళ్లినప్పుడు ఎలాంటి ఆంక్షలు గానీ, స్వీయ నిర్బంధంలో ఉండాల్సిన అవసరం గానీ ఉండదు.
అత్యవసర వినియోగ జాబితాలో చేర్చేందుకు భారత్ బయోటెక్ తొలిసారి ఏప్రిల్ 19న ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారం అందించింది. దీనిపై పలుమార్లు నిపుణుల కమిటీ భేటీ అయ్యింది. కొవాగ్జిన్ టీకా క్లినికల్ ట్రయల్స్ డేటాను, భద్రత, సామర్థ్యం, రోగ నిరోధకత తదితర అంశాలపై డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక సలహా బృందం సమీక్ష నిర్వహించింది. అనంతరం ఈయూఎల్లో చేర్చేందుకు అనుమతిచ్చింది. ఇప్పటికే భారత్లో కొవాగ్జిన్ టీకాను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. రెండు డోసుల్లో తీసుకునే ఈ టీకా కరోనాతో పాటు పలు వేరియంట్ల నుంచి రక్షణ కల్పిస్తుంది.
కరోనా మహమ్మారి నియంత్రణలో వ్యాక్సిన్ తయారీకి ముందు నుంచీ భారత్ బయోటెక్ సంస్థ చొరవ చూపుతూ వచ్చింది. ప్రపంచానికి పెను సవాల్గా మారిన ఈ వైరస్కు విరుగుడును దిగుమతి చేసుకోవడం కాకుండా భారత్లోనే తయారుచేయాలని సంకల్పించుకుంది. ప్రమాణాల విషయంలో రాజీపడకుండా వేగంగా పరీక్షలు నిర్వహిస్తూ కొవాగ్జిన్ను తయారుచేసింది. బీఎస్ఎల్-3 ల్యాబ్ సౌకర్యం ఉండటం, గతంలోనూ పలు మహమ్మారులకు టీకాలు తయారుచేసే అనుభవంతో కొవాగ్జిన్ను రూపొందించింది. మన దేశంలో విస్తృతంగా వినియోగంలో ఉన్న కొవాగ్జిన్ కరోనా వైరస్ నుంచి 77.8శాతం రక్షణ కల్పిస్తుండగా.. డెల్టా వేరియంట్ నుంచి 65.2శాతం మేర రక్షణ కల్పిస్తున్నట్టు పలు పరిశోధనల్లో తేలిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని