కొవిడ్ మూలాలు: దర్యాప్తు జరిపినా..వీడని గుట్టు!
కొవిడ్ మూలాలపై మరోసారి దర్యాప్తును కొనసాగించాలని పిలుపునిస్తూ 26మందితో కూడిన అంతర్జాతీయ నిపుణుల బృందం బహిరంగ లేఖ విడుదల చేసింది.
మరోసారి దర్యాప్తు చేయాలంటున్న అంతర్జాతీయ నిపుణులు
షాంఘై: ప్రపంచాన్ని వణికిస్తోన్న కొవిడ్-19 మహమ్మారి మూలాలను కనిపెట్టేందుకు ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు జరిగింది. అయినప్పటికీ కొవిడ్ మూలాలపై ఎలాంటి స్పష్టత రాలేదు. వీటి మూలాలను ప్రపంచం తెలుసుకోవడం దరిదాపుల్లో కనిపించడం లేదని అంతర్జాతీయ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి దర్యాప్తును కొనసాగించాలని పిలుపునిస్తూ 26మందితో కూడిన అంతర్జాతీయ నిపుణుల బృందం బహిరంగ లేఖ విడుదల చేసింది.
సంవత్సరం గడిచినా..యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కొవిడ్ మూలాలను కనుక్కోవడంలో ఎలాంటి పురోగతి సాధించలేదని ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ యూనివర్సిటీకి చెందిన వ్యాక్సిన్ నిపుణులు నికోలయ్ పెట్రోవ్స్కై అభిప్రాయపడ్డారు. కొవిడ్ మూలాలపై వస్తోన్న వాదనలకు జవాబిచ్చే విధంగా స్వతంత్ర, నిస్పక్షపాత దర్యాప్తును ప్రపంచ ఆరోగ్య సంస్థ చేయలేకపోయిందన్నారు. కొవిడ్ మూలాలను తెలుసుకునేందుకు మరోసారి దర్యాప్తు జరపాలంటూ 26మందితో కూడిన అంతర్జాతీయ నిపుణుల బృందంతో బహిరంగ లేఖ విడుదల చేస్తున్నామన్నారు.
WHO తీరుపై విమర్శలు..
కొవిడ్ మూలాలను శోధించేందుకు ప్రపంచ ఆరోగ్యసంస్థ దర్యాప్తు బృందం నెల రోజుల పాటు చైనాలో పర్యటించింది. కానీ, దర్యాప్తు జరిపిన తీరుపై ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా రాజకీయ ప్రభావం ఎక్కువగా ఉన్న చైనా అధికారులపైనే దర్యాప్తు బృందం పూర్తిగా ఆధారపడిందని.. సరైన ఆధారాలు, కీలక సమాచారం సేకరించడంలో విఫలమైందనే ఆరోపణలు ఎదురవుతున్నాయి. వైరస్ను మొట్టమొదటి సారిగా గుర్తించిన ప్రదేశం వివరాలను ఇవ్వడానికి చైనా సుముఖంగా లేదని దర్యాప్తు బృంద సభ్యులు తొలుత వెల్లడించిన విషయాన్ని అంతర్జాతీయ నిపుణులు గుర్తుచేస్తున్నారు. వుహాన్లోని ల్యాబ్ నుంచి వైరస్ బయటపడే అవకాశమే లేదంటూ దర్యాప్తు బృందం సభ్యుడే కొట్టిపారేయడం ఎలాంటి అర్థం లేని వ్యాఖ్య అని ఫ్లిండర్స్ యూనివర్సిటీ నిపుణుడు పెట్రోవ్స్కై పేర్కొన్నారు. అలా కొట్టిపారేయడానికి కావాల్సిన ఎలాంటి శాస్త్రీయ సమాచారం దర్యాప్తు నివేదికలో కనిపించలేదని స్పష్టంచేశారు.
మరోసారి దర్యాప్తు చేయాల్సిందే..
కొవిడ్ మహమ్మారికి కారణమైన సార్స్-కోవ్-2 వైరస్, తొలుత చైనాలోని వుహాన్లో బయటపడిందనే యావత్ ప్రపంచం భావించింది. ఈ మహమ్మారి మూలాలను శోధించాలని ప్రపంచ దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థపై ఒత్తిడితెచ్చాయి. తొలుత దీనికి ఒప్పుకోని చైనా, చివరకు అంతర్జాతీయంగా వస్తోన్న ఒత్తిడితో దర్యాప్తునకు అంగీకరించింది. దీంతో డబ్ల్యూహెచ్ఓ నేతృత్వంలోని అంతర్జాతీయ నిపుణులు బృందం వుహాన్లోని ఆసుపత్రులు, పరిశోధనా కేంద్రాలను పరిశీలించి దర్యాప్తు జరిపింది. అయితే, కొవిడ్ మూలాలు వుహాన్లోనే తొలుత బయటపడ్డాయని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లభించలేదని దర్యాప్తు బృందం ప్రకటించింది. ఇతర జంతువుల నుంచే సోకి ఉండవచ్చని అభిప్రాయపడినప్పటికీ వాటికి సంబంధించిన రుజువులను కనిపెట్టలేకపోయింది.
ఇలా మిస్టరీగా మారిన కొవిడ్ మూలాలపై గుట్టు విప్పేందుకు పరిశోధనలు కొనసాగించాలని అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తు జరిపినప్పటికీ కొవిడ్ మూలాలను ఇప్పటివరకు ఎవరూ గుర్తించలేదన్నారు. ఈ విషయాలను యావత్ ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ బహిరంగ లేఖను విడుదల చేస్తున్నామని అంతర్జాతీయ నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్ మూలాలపై చైనాలో జరిపిన దర్యాప్తు నివేదికపై ప్రపంచ ఆరోగ్యసంస్థ మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.