పట్టాలెక్కుతున్న కొవిడ్ ఐసోలేషన్ కోచ్లు..!
కరోనా ఉద్ధృతి పెరిగిన నేపథ్యంలో రైల్వేశాఖ కొవిడ్ ఐసోలేషన్ కోచ్లను మరోసారి సిద్ధం చేస్తోంది. అవసరమైన రాష్ట్రాల్లో ఈ బోగీలను ఉంచేందుకు ఇప్పటివరకు 4వేల కోచ్లను సిద్ధం చేసినట్లు వెల్లడించింది.
4వేల కోచ్లు సిద్ధం చేసిన రైల్వేశాఖ
దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి పెరుగుతోన్న వేళ.. పలు రాష్ట్రాల్లో ఆసుపత్రులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. దీంతో కొవిడ్ సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసుకునే పనిలో ఆయా రాష్ట్రాలు నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ కొవిడ్ ఐసోలేషన్ కోచ్లను మరోసారి సిద్ధం చేస్తోంది. అవసరమైన రాష్ట్రాల్లో రైల్వే ఐసోలేషన్ బోగీలను ఉంచేందుకు ఇప్పటివరకు 4వేల కోచ్లను సిద్ధం చేసినట్లు వెల్లడించింది.
పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో అక్కడి ఆసుపత్రులు కొవిడ్ రోగులతో నిండిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు గతేడాది రైల్వేశాఖ తయారు చేసిన కొవిడ్ ఐసోలేషన్ కోచ్లను మరోసారి సిద్ధం చేసింది. ఇప్పటికే వీటిలో కొన్నింటిని మహారాష్ట్రలో అందుబాటులో ఉంచామని రైల్వేశాఖ ప్రకటించింది. ‘కరోనా పోరులో భాగంగా రైల్వేశాఖ తన వనరులను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా కొవిడ్ ఐసోలేషన్ కోచ్లను మహారాష్ట్రలోని నందూర్బార్లో అందుబాటులో ఉంచాము. అక్కడ కరోనా రోగులకు సేవలు ప్రారంభమయ్యాయి’ అని రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విటర్లో వెల్లడించారు. ప్రస్తుతం నందూర్బార్లో 94 కొవిడ్ ఐసోలేషన్ కోచ్లు ఏర్పాటు చేయగా.. వీటిలో ప్రస్తుతం ఆరుగురు రోగులు చికిత్స పొందుతున్నారన్నారు. కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండి.. ఆసుపత్రుల్లో రోగుల తాకిడి పెరగడం, కొవిడ్ పడకలు అందుబాటులో లేని రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు రైల్వే ఐసోలేషన్ కోచ్లను కేటాయిస్తున్నామని పీయూష్ గోయల్ పేర్కొన్నారు.
మాకూ ఐసోలేషన్ కోచ్లు ఇవ్వండి..
దేశ రాజధానిలో కొవిడ్ తీవ్రత పెరుగుతోన్న వేళ.. ప్రత్యేక రైల్వే ఐసోలేషన్ బోగీలను ఏర్పాటు చేయాలని దిల్లీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతోన్న సందర్భంగా దాదాపు 5వేల పడకల సామర్థ్యం కలిగిన ఐసోలైషన్ బోగీలను దిల్లీలో అందుబాటులో ఉంచాలని దిల్లీ సీఎస్ విజయ్ కుమార్ రైల్వే బోర్డు ఛైర్మన్కు లేఖ రాశారు. ఇప్పటికే నగరంలోని ఆసుపత్రులు కొవిడ్ రోగులతో నిండిపోతుండడంతో ముందుజాగ్రత్త చర్యగా వీటిని అందుబాటులో ఉంచాలని కోరారు.
ఇదిలాఉంటే, దేశంలో గతేడాది కరోనా వైరస్ తొలిదఫా విజృంభణ సమయంలో రైల్వే శాఖ ప్రత్యేక ఐసోలేషన్ బోగీలను ఏర్పాటు చేసింది. పలు రాష్ట్రాల్లో 813 కోచ్ల ద్వారా దాదాపు 12వేలకు పైగా పడకలను అందుబాటులో ఉంచింది. దిల్లీకి 503 కోచ్లు, ఉత్తర్ ప్రదేశ్లో 270 కోచ్లు, బిహార్లో 40కోచ్లతో పాటు పలు రాష్ట్రాలకు అవసరమైన ఐసోలేషన్ కోచ్లను రైల్వేశాఖ అందుబాటులో ఉంచింది. అయితే, వాటిలో ఎక్కువగా వినియోగించలేదని సమాచారం. తాజాగా మరోసారి కొవిడ్ ఉద్ధృతి పెరగడంతో మహారాష్ట్ర, దిల్లీ వంటి రాష్ట్రాలు ఐసోలేషన్ బోగీలు కావాలని రైల్వేశాఖకు విజ్ఞప్తి చేస్తున్నాయి. వీటిలో స్వల్ప లక్షణాలు కలిగిన కొవిడ్ రోగులను ఐసోలేషన్లో ఉంచడంతోపాటు మరికొన్ని బోగీల్లో ఆక్సిజన్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. వీటి పర్యవేక్షణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖ కలిసి సంయుక్తంగా చేపడుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
నేటి నుంచి ‘వీఐటీఈఈఈ’ ప్రవేశ పరీక్షలు
వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ కోర్సులో చేరేందుకు వీఐటీ.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలను (వీఐటీఈఈఈ) నిర్వహిస్తోంది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!