Coronavirus: అగ్రరాజ్యంలో 1.5 లక్షల కేసులు.. జపాన్లో ఎమర్జెన్సీ..
డెల్టా వేరియంట్ల విజృంభణతో పలు ప్రపంచ దేశాల్లో వైరస్ మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతున్నప్పటికీ... కొత్త కేసులు భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది....
ప్రపంచ దేశాల్లో డెల్టా వేరియంట్ల విజృంభణ
దిల్లీ: డెల్టా వేరియంట్ల విజృంభణతో పలు ప్రపంచ దేశాల్లో వైరస్ మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతున్నప్పటికీ.. కొత్త కేసులు భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో కొద్దిరోజులుగా ఒకటిన్నర లక్షలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కేసుల పెరుగుదలతో పలు దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. జపాన్లోని కీలక ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించగా, ఆస్ట్రేలియాలోని సిడ్నీలో సెప్టెంబర్ చివరి వరకూ లాక్డౌన్ పొడిగించారు.
ప్రపంచవ్యాప్తంగా గురువారం ఒక్కరోజే ఏకంగా 7.23 లక్షల మందికి వైరస్ సోకింది. దాదాపు 11వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్రరాజ్యం అమెరికాలో వైరస్ ఉద్ధృతి మరింత తీవ్రంగా ఉంది. డెల్టా వేరియంట్లతో వైరస్ల బారిన పడుతున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అమెరికాలో గురువారం ఒక్కరోజే 1.54 లక్షల మందికి పాజిటివ్గా తేలింది. 967 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 3.82 కోట్లకు చేరింది.
జపాన్లోనూ కొవిడ్ ఉగ్రరూపం దాలుస్తోంది. గతవారం సగటున రోజుకు 20వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో వైరస్ కట్టడి కోసం జపాన్ ప్రభుత్వం పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించింది. సెప్టెంబర్ 12 వరకూ అత్యవసర పరిస్థితి కొనసాగనుందని ప్రకటించింది. రెస్టారెంట్లు, బార్లు రాత్రి 8 గంటలలోపు మూసివేయాలని.. షాపింగ్ మాళ్లలో ప్రజలు గుమికూడకుండా చూడాలని స్పష్టం చేసింది. టోక్యో, ఒకినావా సహా మరో 13 ప్రాంతాలకు ఎమర్జెన్సీని విస్తరించాలని నిర్ణయించింది. మిగిలిన ప్రాంతాల్లో పాక్షిక ఎమర్జెన్సీ అమల్లో ఉంటుంది.
ఆస్ట్రేలియాలోనూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం న్యూ సౌత్వేల్స్లో 642 కొత్త కేసులు నమోదయ్యాయి. వరుసగా నాలుగో రోజు 600లకు పైగా కేసులు వచ్చాయి. వైరస్ ఉద్ధృతితో సిడ్నీలో లాక్డౌన్ పొడిగించారు. సెప్టెంబర్ చివరివరకు ఆంక్షలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. తప్పనిసరిగా మాస్కు ధరించడం, కర్ఫ్యూ వంటి కఠిన నిబంధనలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
నేటి నుంచి ‘వీఐటీఈఈఈ’ ప్రవేశ పరీక్షలు
వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ కోర్సులో చేరేందుకు వీఐటీ.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలను (వీఐటీఈఈఈ) నిర్వహిస్తోంది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!