ట్రంప్ను మీరు తప్పిస్తారా..లేదా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్లు ఎక్కువవుతున్నాయి. మరోవైపు ఆయన పాలక వర్గంలోని ఉన్నతాధికారులు ఒక్కొక్కరు రాజీనామా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ 25వ.........
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్లు ఎక్కువవుతున్నాయి. మరోవైపు ఆయన పాలక వర్గంలోని ఉన్నతాధికారులు ఒక్కొక్కరు రాజీనామా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ 25వ సవరణ ప్రకారం ట్రంప్ను తప్పించాలని డెమోక్రాటిక్ పార్టీ సభ్యులతో పాటు కొంతమంది రిపబ్లికన్ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్నారు.
ట్రంప్ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నవారిలో ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీతో పాటు సెనేట్ డెమోక్రాటిక్ నేత చక్ షుమెర్ వంటి ప్రముఖులు ఉన్నారు. ఈ మేరకు వారివురు గురువారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అధ్యక్షుడిని తొలగించాలని మైక్ పెన్స్ను కోరారు. లేదంటే సభలో అభిశంసన ప్రక్రియ మొదలుపెడతామని తేల్చి చెప్పారు. ‘‘అధ్యక్షుడు భయంకరమైన, దేశద్రోహ చర్యలకు పాల్పడిన దృష్ట్యా ఆయన్ని వెంటనే పదవి నుంచి తప్పించాల్సిన అవసరం ఉంది. 25వ సవరణ ద్వారా ఆయన్ని తొలగించాలని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ను కోరాం. ఇంత వరకూ ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. త్వరలోనే ఆయన నుంచి సానుకూల సమాధానం వస్తుందని భావిస్తున్నాం. పెన్స్ సహా క్యాబినెట్ సభ్యులు వారు చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉంటారని ఆశిస్తున్నాం’’ అని పెలోసీ తెలిపారు.
ఒకవేళ పెన్స్ 25వ సవరణను ప్రయోగించకపోతే.. సభలో అభిశంసన ప్రక్రియ మొదలపెడతామని పెలోసీ, షుమెర్ వేర్వేరు ప్రకటనల ద్వారా తేల్చి చెప్పారు. దేశ ప్రజలంతా ఇదే కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. విద్రోహ చర్యలకు కారణమైన వారికి ఇదే సరైన న్యాయమని ఎద్దేవా చేశారు. 1963లో అమెరికా రాజ్యాంగంలో ఈ 25వ సవరణ తీసుకొచ్చారు. అధ్యక్షుడు తన విధులను సక్రమంగా నిర్వర్తించకుండా, పదవిని స్వచ్ఛందంగా వీడేందుకు ఒప్పుకోని పరిస్థితుల్లో దీన్ని అమలు చేయవచ్చు. అధ్యక్షుడు తన విధులను సక్రమంగా నిర్వర్తించే స్థితిలో లేరంటూ ఉపాధ్యక్షుడు, మెజార్టీ కేబినెట్ నిర్ణయించడం ద్వారా ఆయనను పదవి నుంచి తప్పించే వీలుంటుంది.
మరోవైపు ట్రంప్ ఓటమిని బహిరంగంగా అంగీకరించిన విషయం తెలిసిందే. అధికార బదిలీకి సహకరిస్తానని హామీ ఇచ్చారు. జనవరి 20న కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోందని వ్యాఖ్యానించారు. అయితే, అభిశంసన నుంచి తప్పించుకోవడానికే ట్రంప్ చివరి నిమిషంలో ఓటమిని అంగీకరించారని విమర్శలు వస్తున్నాయి. కనీసం మరో మరికొన్ని రోజులైనా తాను అధికారంలో ఉండాలని భావిస్తున్నారని ఆయన వ్యతిరేకులు అభిప్రాయపడుతున్నారు. కానీ, ఆయనకు ఆ అర్హత లేదని పేర్కొన్నారు. ఆయన కేబినెట్లో ఒక్కొక్కరు రాజీనామా చేస్తుండడంతో ట్రంప్ అప్రమత్తమయ్యారన్నారు. కనీసం ఆ రకంగానైనా మరికొంత కాలం పదవిని కాపాడుకునేందుకు యత్నిస్తున్నారని అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
నేటి నుంచి ‘వీఐటీఈఈఈ’ ప్రవేశ పరీక్షలు
వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ కోర్సులో చేరేందుకు వీఐటీ.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలను (వీఐటీఈఈఈ) నిర్వహిస్తోంది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి డాక్టర్ లక్ష్మి