Ghatak: శత్రువు పాలిట ‘ఘాతక్’..!
అర్మేనియా-అజర్ బైజన్ మధ్య జరిగిన నాగర్నో-కారబాకు యుద్ధం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా యుద్ధక్షేత్రాలు పూర్తిగా మారిపోయాయి. భవిష్యత్తు యుద్ధాలు కేవలం యంత్రాల
సామాజిక మాధ్యమాల్లో భారత్ డ్రోన్ సందడి
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
అర్మేనియా-అజర్ బైజన్ మధ్య జరిగిన నాగర్నో-కారబాకు యుద్ధం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా రణక్షేత్రాలు పూర్తిగా మారిపోయాయి. భవిష్యత్తు యుద్ధాలు కేవలం యంత్రాల మధ్యే జరుగుతాయని తేలిపోయింది. ఫలితంగా ప్రపంచంలోని సూపర్ పవర్లు ఇప్పుడు మానవరహిత వాహనాలపై దృష్టిపెట్టాయి. భారత్ కొంచెం ఆలస్యంగా అయినా ఈ రేసులో అడుగుపెట్టింది. కశ్మీర్లోని వాయుసేన స్థావరంపై దాడి తర్వాత డ్రోన్ ప్రాజెక్టులను మరింత వేగవంతం చేసింది. భారత్ అభివృద్ధి చేస్తోన్న ఓ డ్రోన్ వీడియో తాజాగా గత వారం సోషల్ మీడియాలో సందడి చేసింది. ఈ ఏడాది భారత్ డ్రోన్ ప్రాజెక్టులు కీలక దశకు చేరుకొన్నాయనే చెప్పాలి.
ఏమిటీ ఘాతక్..?
భారత రక్షణ రంగ పరిశోధనశాలలు అభివృద్ధి చేస్తోన్న మానవ రహిత యుద్ధ విమానం(యూఏసీవీ) పేరు ఘాతక్. ఈ ప్రాజెక్టుకు 2016 భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత కొన్ని నెలలుగా గుర్తుతెలియని ప్రాంతంలో ఇది ట్యాక్సీ ట్రయల్స్ నిర్వహించుకుంటోంది. దీనిపై డీఆర్డీవో, రక్షణ శాఖల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీనికి సంబంధించిన సాంకేతికత ప్రయోగాత్మక ప్రాజెక్ట్ అయిన స్విఫ్ట్ (స్టెల్త్ వింగ్ ఫ్లయింగ్ టెస్ట్బెడ్) చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. గతంలో దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వచ్చిన డిజైన్ను ఇది పోలి ఉంది. భారత నావికా దళం కూడా భవిష్యత్తులో దీనిని వినియోగించేట్లు సిద్ధం చేస్తున్నట్లు యూరేషియన్ టైమ్స్ పత్రిక పేర్కొంది. ఈ ప్రాజెక్టు 2024-25లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇటువంటి డ్రోన్లు ప్రపంచంలో మరెక్కడ ఉన్నాయి..
రష్యా వద్ద సుఖోయ్-70 ఓక్ట్నిక్ పేరిట ఇటువంటి డిజైన్ను పోలిన డ్రోన్ ఉంది. ఇక చైనా ‘జీజే-11 షార్ప్ సోర్డ్’ పేరిట ఇటువంటి స్టెల్త్ డ్రోన్ను అభివృద్ధి చేసింది. ఫ్రాన్స్ ‘డసాల్ట్ న్యూరాన్’ స్టెల్త్ డ్రోన్ను వాడుతోంది. భారత్ అభివృద్ధి చేస్తోన్న ఘాతక్ డిజైన్కు దీనికి మధ్య చాలా పోలికలు ఉన్నాయి. ఫ్రాన్స్ సంస్థ భారత ప్రాజెక్టుకు సాయం చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. కానీ, ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. భారత్ ఇప్పటికే డసో నుంచి రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
డ్రోన్ల దండు ప్రాజెక్టు కూడా..
ఏకకాలంలో పదుల సంఖ్యలో డ్రోన్లు శత్రువుపై విరుచుకుపడి దాడి చేసేలా భారత్ స్వార్మ్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. ఆగస్టులో భారతసైన్యం విజయవంతంగా 75 డ్రోన్లను ఏకకాలంలో గాల్లోకి ఎగురవేసి నిర్దేశిత లక్ష్యాలపై అత్యంత కచ్చితత్వంతో దాడి చేసింది. ఇవి ఆత్మాహుతి డ్రోన్ల వలే పనిచేశాయి. భవిష్యత్తులో 1000 డ్రోన్లతో ఏకకాలంలో దాడి చేసేలా టెక్నాలజీని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన హరాప్ ఆత్మాహుతి డ్రోన్లను ఇప్పటి వరకు వాడుతున్నాం. తాజాగా స్వార్మ్ సాంకేతికత అభివృద్ధిలో ప్రైవేటు రంగ కంపెనీలకు భాగస్వామ్యం కల్పించారు.
వడివడిగా తాపస్-2 ప్రయోగాలు..
అత్యంత ఎత్తుల్లో ప్రయాణిస్తూ శత్రుస్థావరాలపై నిఘాపెట్టేలా తయారు చేస్తోన్న తాపస్-2 డ్రోన్ ప్రయోగాలు దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. దీనిని రుస్తుం-2 అని కూడా అంటారు. కొవిడ్ కారణంగా కొంత జాప్యం జరిగినా.. దీని యూజర్ ట్రయల్స్ కూడా కొన్నాళ్లలో మొదలు కావచ్చు. ఇక దీనికి ముందు వెర్షన్ అయిన తాపస్ -1(రుస్తుం-1)ను ఆర్చర్ పేరిట సాయుధ డ్రోన్గా అభివృద్ధి చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు